మహీంద్రా ఎలక్ట్రిక్ సుప్రో వ్యాన్ విడుదల: ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు

By Anil

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ మార్కెట్లోకి తమ మూడవ ఎలక్ట్రిక్ ఉత్పత్తి ఇసుప్రో ఎలక్ట్రిక్ వ్యాన్‌ను విడుదల చేసింది. ఎలక్ట్రిక్ సుప్రో వ్యాన్ వాహనం యొక్క ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా నిర్ణయించింది.

భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

ఎలక్ట్రిక్ సుప్రో వాహనాలు భారత దేశం యొక్క మొదటి ఉద్గార రహిత కార్గో మరియు ప్యాసింజర్ వాహనాలు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది మరియు విడుదల చేసే వాటిలో మహీంద్రా అండ్ మహీంద్రా ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంది.

మహీంద్రా ఇసుప్రో ధర వివరాలు

మహీంద్రా ఇసుప్రో ధర వివరాలు

  • ఇసుప్రో (కార్గో) ధర రూ. 8.45 లక్షలు
  • ఇసుప్రో (ప్యాసిజర్) ధర రూ. 8.75 లక్షలు
  • రెండు ఎక్స్ షోరూమ్ ధరలు రాష్ట్ర మరియు FAME రాయితీలను కలుపుకుని నిర్ణయించబడ్డాయి.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    మహీంద్రా తమ ఇసుప్రో వ్యాన్లలో శక్తివంతమైన త్రీ ఫేజ్ ఇండక్షన్ ఏసి మోటార్ కలదు.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    ఇందులోని శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ సుమారుగా 3,000ఆర్‌పిఎమ్ వద్ద 33.53బిహెచ్‌పి పవర్ మరియు 1,500ఆర్‌పిఎమ్ వద్ద 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    మహీంద్రా ఇసుప్రో శ్రేణి ఎలక్ట్రిక్ వ్యాన్‌ యొక్క గరిష్ట వేగం గంటకు 60కిలోమీటర్లుగా ఉంది.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    ఇసుప్రోలోని ఎలక్ట్రిక్ మోటార్‌కు 200ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీకి అనుసంధానం చేశారు.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    ఎలక్ట్రిక్ సుప్రో కార్గో వ్యాన్ యొక్క రేంజ్ 112 కిలోమీటర్లు మరియు ఎలక్ట్రిక్ సుప్రో ప్యాసింజర్ వ్యాన్ యొక్క రేంజ్ 115 కిలోమీటర్లుగా ఉంది.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    15ఏఎమ్‌పి ప్లగ్ పాయింట్ ద్వారా బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి 8 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    మహీంద్రా ఎలక్ట్రిక్ సుప్రో పొడవు 3,798ఎమ్ఎమ్, వెడల్పు 1,540ఎమ్ఎమ్, ఎత్తు 1,920ఎమ్ఎమ్ మరియు వీల్ బేస్ 1,920ఎమ్ఎమ్ అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ 130ఎమ్ఎమ్‌గా ఉంది.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    ఇసుప్రో కార్గో వ్యాన్ బరువు 1,280 కిలోలు మరియు ఇసుప్రో ప్యాసింజర్ వేరియంట్ సుమారుగా 1320 కిలోలుగా ఉంది.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    ఎలక్ట్రిక్ కార్గో వ్యానులో గరిష్టంగా 600 కిలోలను రవాణా చేయవచ్చు మరియు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వ్యానులో ఎనిమిది మంది ప్రయాణించవచ్చు.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    13-అంగుళాల చక్రాలకు 155/80 ఆర్13 కొలతల్లో ఉన్న ట్యూబ్ లెస్ టైర్లను అందించారు. వాహనంలో ఉన్న నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందించారు.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ సుప్రో ను రెండు ఏళ్ల వారంటీ లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అదే విధంగా ఎలక్ట్రిక్ బ్యాటరీ మీద మూడేళ్ల వారంటీ లేదా 40,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

    భారతదేశపు మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ & కార్గో వ్యాన్ విడుదల

    • మిరేజ్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనున్న మిత్సుబిషి
    • 2016 పండుగ సీజన్ కోసం ఫియట్ మోటార్స్ ఆఫర్ల వెల్లువ
    • రెండు చేతులు లేని వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసిన అధికారులు

Most Read Articles

English summary
Read In Telugu: Mahindra eSupro Launched In India; Prices Start At Rs. 8.45 Lakh
Story first published: Friday, October 7, 2016, 9:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X