Just In
- 17 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 38 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎర్ర బుగ్గను తొలగించకుండా కేంద్రానికి సవాల్ విసురుతున్న కర్ణాటక మంత్రి
కార్ల మీద ఎర్ర బుగ్గల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిన తరువాత, తన కారు మీద ఉన్న బుగ్గను తొలగించడాన్ని కర్ణాటకు చెందిన ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వ్యతిరేకిస్తున్నాడు.
వీఐపీ
సంస్కృతికి
స్వస్తి
పలుకుతూ
కార్ల
మీద
హోదాను
సూచించే
ఎర్ర
బుగ్గల
వాడకాన్ని
మోడీ
ప్రభుత్వం
నిషేధించింది.
మనమంతా
సాధారణ
ప్రజలతో
సమానం
అనే
భావనను
తెలియజేసే
ఈ
నిర్ణయాన్ని
దాదాపు
అన్ని
రాష్ట్రాల
వీఐపీలు
స్వాగతించారు.
అత్యవసర వాహనాలకు వాహనాలకు వాడుతున్న నీలం రంగు బుగ్గలను యథావిధిగా ఉంచి, అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రధాన అధికారులు మరియు రాజకీయ నాయకుల కార్లపై ఉండే ఎర్ర బుగ్గలను తొలగించాలని కేంద్ర ఆదేశించింది.
అయితే కొంత మంది ఎర్ర బుగ్గలను తొలగించడానికి అయిష్టతను చూపగా, మరికొంత మంది వీటిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభంలో తన కారు మీద ఉన్న ఎర్ర బుగ్గను తొలగించడానికి అయిష్టత చూపారు, ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి యుటి ఖాదర్ ఎర్ర బుగ్గను తొలగించడానికి ఆసక్తి చూపడం లేదు.
ఈ విషయం గురించి యుటి ఖాదర్ మాట్లాడుతూ, ముఖ్య మంత్రి కోరితే తన కారు మీద ఉన్న ఎర్ర బుగ్గను తొలగిస్తాను, అంత వరకు తొలగించనని పేర్కొన్నాడు.
ముఖ్య మంత్రి గారు స్వయంగా నా కారు మీద ఉన్న ఎర్ర బుగ్గను తొలగించమని కోరితే అతని ఆదేశాలకు విధేయతగా దానిని తీసేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ కారును నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కాబట్టి ఇందులో ఎలాంటి మార్పులు చేసే హక్కు నాకు లేదని తెలిపాడు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి స్పందిస్తూ, సాధారణ ప్రజలను వీఐపి స్థాయికి తీసుకొచ్చేందుకు వీఐపీ సంస్కృతిని రూపుమాపుతోందని తెలిపాడు.
ఎర్ర బుగ్గ మా కారు మీద ఉందని నేను ఎక్కడికీ ప్రయాణం చేయలేదు, నేను ఎక్కడికైనా వెళ్లడానికి ప్రభుత్వం కారు ఇచ్చింది కాబట్టి అదే కారులో ప్రయాణిస్తున్నాని వివరణ కూడా ఇచ్చాడు ఈ కర్ణాటక మంత్రి.
ఎర్ర బుగ్గలను తొలగించడానికి నేను అడ్డు చెప్పడం లేదు, అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే బదులు ప్రజల ఆకలి తీర్చే మరియు ఉచిత విద్యను అందించే పథకాల మీద దృష్టిసారిస్తే బాగుండేదని హితవు పలికాడు.
డ్రైవ్స్పార్క్ తెలుగు ఆలోచన! వీఐపీ సాంప్రదాయానికి ముగింపు పలికే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదే. దీని వలన ప్రజల మద్య అసమానతలు తగ్గుముఖం పడతాయి. అయితే ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా రాజకీయ నాయకులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నంత వరకు భారత్ కోరుకేనే విజయం సాధించడం కాస్త కష్టమే.