Just In
- 9 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 9 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 11 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 12 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కారు డిక్కీ లగేజికే అనుకున్నాం.. నీకు ఇలా కూడా పనికొస్తోందా బాబు [వీడియో]
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశంలో కూడా ఒకటి. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది మనం నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ చాలామంది ఇప్పటికీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.
Recommended Video
ఇటీవల ఒక వ్యక్తి కారు వెనుక ఉన్న బూట్ స్పేస్ లో పిల్లలను కూర్చోబెట్టి డ్రైవింగ్ చేసిన సంఘటన మరియు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
నివేదికల ప్రకారం, ఈ సంఘటన భాగ్యనగరం (హైదరాబాద్) లో జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి ముగ్గురు పిల్లలను బూట్ స్పేస్ లో కూర్చోబెట్టాడు. ఇందులో ఇద్దరు అమ్మయిలు, ఒక అబ్బాయి ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ ముగ్గురు ఒక బొమ్మతో ఆదుకోవడం కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియోను సోంచో జరా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చేస్తూ ఇలా రాష్ట్రాలు 'వారెంత బాధ్యత లేని తల్లిదండ్రులు? దయచేసి వారిపైన చర్యలు తీసుకోండి సార్' అంటూ.. KTRTRS TelanganaCOPs HiHyderabad tsrtcmdoffice పేర్లను ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్పై స్పందించిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కారు నంబర్ ప్లేట్ ఆధారంగా వారికి చలాన్ జారీ చేశారు. 'సర్ మీ ఫిర్యాదు మేరకు ఈ సంఘనతనకు కారకుడైన వాహనదారుడికి ఇ-చలాన్ పంపాము. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులతో చేతులు కలిపినందుకు ధన్యవాదాలు' అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రీ ట్వీట్ చేశారు.
ఈ కారులో పిల్లలతో సహా మొత్తమ్ 7 మంది ఉన్నట్లు చూడవచ్చు. ఇందులో ముందు ఇద్దరు, మధ్యలో ముగ్గురు కూర్చున్నారు. పిల్లలకు స్పేస్ లేనందున ఆ కారు యొక్క బూట్ స్పేస్ లో కూర్చోబెట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియోని వెనుక వాహనదారులు షూట్ చేశారు. ఇందులో కనిపిస్తున్న కారు హ్యుందాయ్ కంపెనీ యొక్క గ్రాండ్ ఐ10.
ఈ వీడియో చూసినవారిలో చాలామంది ఈ సంఘటనకు కారకులైన వారికి జరిమానా విధించాలని, మరికొందరు వారికి తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు. అంతే కాకుండా వారిలో ఒకరు అతనికి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పాడు.
ఈ వీడియోలో ఆ కారు యొక్క నెంబర్ ప్లేట్ TS7HA8607 కూడా స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలను కారు కూర్చోబెట్టి అతడు టెయిల్ గేట్ అలాగే ఓపెన్ చేసి ఉంచాడు. కావున అనుకోకుండా ఏదైనా స్పీడ్ బ్రేకర్ వంటివి వస్తే వెనుక ఉన్న వారు కిందికి పడే అవకాశం ఉంటుంది. ఇది ఊహకందని ప్రమాదాన్ని కలిగిస్తుంది.
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. కావున వాహనాలను నడిపే వారు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసినప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే ఇక్కడ వెనుక పిల్లలను కూర్చోబెట్టి ముందువున్న వారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
నిజానికి కారులో బూట్ స్పేస్ అనేది లగేజ్ ఉంచుకోవడానికి మాత్రమే, మనకు ఇక్కడ కలిపిస్తున్న వీడియోలో అది పిల్లలను తరలించడానికి అన్నట్లు అనిపిస్తుంది. ఇది ఏ మాత్రం సురక్షితం కాదు. కావున ఇలాంటి వాటిపైన పోలీసులు తప్పకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మున్ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది.
Sir,
— CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (CYBTRAFFIC) September 6, 2022
Your information has been verified and E-Challan has been generated. Thanks for joining hands with Cyberabad Traffic Police in improving road safety.
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో భాగంగానే తప్పకుండా బైక్ రైడర్లు హెల్మెట్ ధరించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు మొదలైన రూల్స్ కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెండవ వరుసలోని ప్రయాణికులకు కూడా తప్పకుండా సీట్ బెల్ట్ ఉండాలనే కొత్త నియమాన్ని తీసుకువచ్చింది. ఇది త్వరలోనే అమలులోకి వస్తుంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
మనం రోడ్డుపైన ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా.. అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అదే నిర్లక్యంగా వెళితే అక్కడ జరిగే ప్రమాదాలను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇది చుట్టుపక్కల ఉన్న వాహనదారులకు కూడా ప్రమాదాన్ని తీసుకువస్తుంది. కావున ఇలాంటి చర్యలను మనం ఎప్పటికప్పుడు ఖండించాలి, అప్పుడే ఇలాంటివి తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతోపాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్స్పార్క్ చూస్తూ ఉండండి.