Just In
- 2 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 4 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 7 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 8 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన సంస్థ సుజుకి మోటార్ సైకిల్. సుజుకి కంపెనీ చాల వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కానీ భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాపించడం వల్ల కంపెనీ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పడు దేశ వ్యాప్తంగా నాల్గవ దశ లాక్ డౌన్ మొదలైంది. భారత ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని నిబంధనల ప్రకారం మళ్ళీ కంపెనీ తమ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించింది.
భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు లాక్ డౌన్ 4.0 నుండి అమలు చేయబడింది. ఇదిలావుండగా ప్రఖ్యాత బైక్ తయారీ సంస్థ సుజుకి మోటార్సైకిల్ హర్యానాలోని గురుగ్రామ్లో తన తయారీ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానిక పరిపాలన నుండి అనుమతి పొందిన తరువాత ఉత్పత్తిని ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.
ఉత్పత్తి సమయంలో కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఆదేశించినదాని ప్రకారం సామాజిక దూరాన్ని నిర్వహించడం సహా ఇతర నిబంధనలను పాటిస్తామని కంపెనీ తెలిపింది. సుజుకి మోటార్సైకిల్ కంపెనీ 2020 మార్చి 23 నుంచి ఉత్పత్తిని నిలిపివేసింది.
MOST READ:అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన బిఎస్ 6 నిస్సాన్ కిక్స్
కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సుజుకి మోటార్సైకిల్ తన తయారీ కర్మాగారాలను నిలిపివేసింది. 55 రోజుల తర్వాత కంపెనీ తన తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుంది.
దీని గురించి సుజుకి మోటార్సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కొచ్చిరో హిరావ్ మాట్లాడుతూ ప్రారంభంలో సుజుకి మోటార్సైకిల్ కంపెనీ పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని లాక్ డౌన్ పూర్తిగా తీసివేరిన తరువాత ప్రారంభిస్తామని చెప్పారు.
MOST READ:సన్నీలియోన్ మనసు దోచుకున్న పింక్ అంబాసిడర్.. మ్యాటర్ ఏంటంటే ?
కరోనావైరస్ అంటూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ మరియు నాన్-మొబిలైజేషన్ సహా పలు రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తెలిపింది.
సంస్థ తన తయారీ కర్మాగారంలో క్రిమిసంహారక గదిని కూడా నిర్మించింది. ప్రతి ఉద్యోగి ప్రతిరోజూ ఈ గది గుండా వెళ్ళాలి. ఇది సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది. ఇప్పుడు ప్రారంభ దశలో తక్కువమంది ఉద్యోగులతో ప్రారంభిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోవడం వల్ల కంపెనీ ఆర్థికంగా బాగా దిగజారింది. ఇప్పుడు మళ్ళీ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సరైన క్రమంలోకి రావడానికి అవకాశం ఉంటుంది.
MOST READ:ఇండియాలో 2020 ఎఎమ్జి జిటి-ఆర్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన మెర్సిడెస్ బెంజ్