కొత్త సంవత్సరంలో కొత్తగా లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ బ్రాండ్స్, ఇవే.. ఓ లుక్కేసుకోండి
పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల వినియోగం వల్ల రోజురోజుకి పర్యావరణంలో కాలుష్య తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. పర్యావరణంలో పెరిగిన కాలుష్యం యొక్క తీవ్రతను తగ్గించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే పర్యావరణ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నంలో ఆటోమోటివ్ పరిశ్రమ ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయడానికి ముందుకు వస్తున్నాయి.

ఐక్యరాజ్యసమితిలో జరిగిన 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీటింగ్ (CoP 26) తర్వాత గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను మరింత తగ్గించేందుకు ప్రపంచ దేశాలు తమ నిబద్ధతను మరింత పెంచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచ ఉద్గారాలలో దాదాపు 52 శాతం వాటాను కలిగి ఉన్న 120 కంటే ఎక్కువ దేశాలు కొత్త జాతీయంగా నిర్ణయించబడిన సహకారాన్ని (NDC) ప్రకటించాయి.

ప్రపంచ మార్కెట్లో ఇప్పటికి చాలా దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. అంతే కాకుండా వాతావరణంలో పెరుగుతున్న ఉద్గారాలను తగ్గించడానికి చాలాదేశాలు కంకణం కట్టుకున్నాయి, పెరుగుతున్న చమురు దిగుమతి బిల్లులు అలాగే ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ కట్టుబాట్లు ఇ-మొబిలిటీకి పరివర్తనను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం కూడా ముందుకు కదిలింది.

భారతదేశంలో EV స్వీకరణను వేగవంతం చేయడానికి మరియు ఎలక్ట్రిక్ వాహనాల యొక్క కొనుగోలు ప్రోత్సహించడానికి కొనుగోలుదారులకు చాలా వరకు సబ్సిడీలు మరియు రాయితీలను కల్పిస్తోంది. భారీ పరిశ్రమల శాఖ, దాని నవీకరించబడిన "హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వేగవంతమైన అడాప్షన్ మరియు తయారీ" (FAME-II) పథకంలో, టూ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలపై 50% వరకు ఎక్కువ ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపైనా ప్రజల ఆసక్తిని పెంచుతుంది.

ఫేమ్-2 పథకం కింద ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా.. ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు ఆటో రంగానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 2022 ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కావున 2022 లో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కొత్త ఎలక్ట్రిక్ బైకులను గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఆల్ట్రావయొలెట్ (Ultraviolette):
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కర్ణాటక రాజధాని నగరం బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు Ultraviolette (అల్ట్రావయోలెట్) ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ బైక్ F77ను పరిచయం చేసింది. ఈ కొత్త పవర్ పుల్ బైక్ సాధారణ బైకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అంటే ఈ బైక్ స్టాండర్డ్ బైక్స్ అందించే పర్ఫామెన్స్ అందిస్తుంది.

Ultraviolette F77 బైక్ గరిష్టంగా గంటకు 140 కిమీ వేగంతో రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకూండా ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. Ultraviolette F77 బైక్ ఒక పూర్తి ఛార్జింగ్తో 150 కి.మీల పరిధిని అందిస్తుంది.

ప్రీవైల్ ఎలక్ట్రిక్ (Prevail Electric):
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన Prevail Electric 'ఎలైట్, ఫైనెస్ మరియు వోల్ఫ్యూరీ' అనే మూడు ప్రీమియం-మోడల్ స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
ఇందులో ఎలైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర రూ. 1,29,999. ఇది గరిష్టంగా 200 కిలోల లోడ్తో గంటకు 80 కిమీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇందులో స్వాపబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కి.మీ పరిధిని అందిస్తుంది. బ్యాటరీ అయిపోయిన తర్వాత, 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

ఇక ఫైనెస్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర రూ. 99,999. ఈ స్కూటర్ గంటకు 60 కి.మీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఇది స్వాపబుల్ బ్యాటరీ ఆప్సన్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ లోని బ్యాటరీ కేవలం 4 గంటల సమయంలో 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేసుకోగలదు.

చివరగా ఇందులోని మూడవ మోడల్ అయిన వోల్ఫ్యూరీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, దీని ధర రూ. 89,999 వరకు ఉంటుంది. దీని గరిష్ట వేగం 50 కిమీ వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

హాఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility):
గ్రీన్, సస్టైనబుల్ మరియు ఎనర్జీ ఎఫెక్టివ్ టూ వీలర్స్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండాలనే లక్ష్యంతో, HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇప్పటికే దాని పోర్ట్ఫోలియోలో ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. కంపెనీ మార్కెట్లో HOP లియో, HOP LYF మరియు HOP OXOలను విక్రయిస్తోంది. ఇవి 2021లో ప్రారంభించబడ్డాయి. HOP LEO, LYF మోడల్లు రెండూ 125 కిమీ పరిధిని అందిస్తాయి.

నెక్జు మొబిలిటీ (Nexzu Mobility):
ప్రముఖ స్వదేశీ ఇ-మొబిలిటీ బ్రాండ్ నెక్జు మొబిలిటీ, దాని స్థానికీకరణ ప్రయత్నాలను ప్రస్తుతం చాలా వేగవంతం చేస్తోంది. నెక్జు పూణేలో ఉన్న దాని తయారీ యూనిట్లతో 100% ‘మేడ్ ఇన్ ఇండియా' EV మొబిలిటీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. అంతే కాకుండా కంపెనీ ఎలక్ట్రిక్ సైకిల్స్ విడుదల చేసి దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








