Just In
- 9 min ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 19 min ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 14 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 14 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
Don't Miss
- Movies విశ్వంభరలో ‘పాత చిరంజీవి’.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ మూవీ హిట్టే!
- News తెలంగాణాలో ప్రచండ భానుడు.. ఆ ఏడు జిల్లాల ప్రజలు బయటకు వెళ్లొద్దు; వాతావరణశాఖ అలెర్ట్!!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించనున్న హోండా టూవీలర్స్!
ఇటీవలి కాలంలో ఆటోమొబైల్ కంపెనీలు మరింత స్వచ్ఛమైన వాహనాల తయారీవైపు ఆసక్తి చూపుతుండటంతో, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల కోసం సరికొత్త సాంకేతికతలు కనిపిస్తాయని స్పష్టమవుతోంది. మరోవైపు,పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు గిరాకీ జోరుగా ఉంటోంది.
తాజాగా, జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కూడా ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మరియు త్రీ-వీలర్స్ కోసం మొబైల్ పవర్ ప్యాక్ అనే కొత్త పోర్టబుల్ మరియు స్వాప్ చేయగల బ్యాటరీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
ఇది ప్రాథమికంగా విద్యుత్ వనరుగా ఉపయోగించడానికి, విద్యుత్తును నిల్వ చేసే కెపాసిటర్గా పనిచేస్తుంది. హోండా ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ కోసం హోమ్ ఛార్జర్పై పనిచేస్తోంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ టాక్సీలు లేదా రిక్షాలపై హోండా ఈ స్వాపబుల్ బ్యాటరీ ప్లాట్ఫామ్ను పరీక్షిస్తున్నట్లు సమాచారం.
అయితే, బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ ఇంకా ఎలాంటి స్థిరమైన ప్రణాళికలను వెల్లడించలేదు. హోండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు మోటార్సైకిళ్ల కోసం ఈ ప్లాట్ఫామ్ను పరీక్షిస్తోందని సమాచారం.
హోండా గతంలో 2024 నాటికి మూడు కొత్త మోడళ్లను విడుదల చేస్తామని, ద్విచక్ర వాహనాల కోసం ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ అభివృద్ధి చేయడంపై తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది.
ఈ మూడు మోడళ్లలో ఒకటి 50సిసి పెట్రోల్ ఇంజన్కు సమానమైన ఎలక్ట్రిక్ మోపెడ్ కూడా ఉంది. మిగిలిన రెండు మోడళ్లలో ఒక ఇ-స్కూటర్ మరియు ఒక ఇ-మోటార్సైకిల్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా 125సిసి ఇంజన్కు సమానమైన పనితీరును చూపొచ్చవని అంచనా.
పెర్ఫార్మెన్స్ పరంగా ఈ మోడళ్లు నిరాడంబరంగా అనిపించినప్పటికీ, అవి హోండాకు ముఖ్యంగా భారతదేశం వంటి బడ్జెట్-సెంట్రిక్ మాస్ మార్కెట్ కోసం మంచి ప్రారంభ స్థానాన్ని కలిగి ఉంటాయి. వాస్తవానికి, ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో అర్బన్, యుటిలిటీ విభాగాల్లో వాహనాలకే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.
హోండా తీసుకురాబోయే ఈ ఎంట్రీ లెవల్ మోడళ్లలో అవుట్పుట్ గణాంకాలు భారీగా ఉండకపోవచ్చు కాబట్టి, వాటిలో భారీ బ్యాటరీ ప్యాక్లను ఎంచుకోవడానికి బదులుగా, హోండా తన పిసిఎక్స్ ఎలక్ట్రిక్ ఇ-స్కూటర్లో ఇప్పటికే ఇన్స్టాల్ చేయబడిన స్వాప్ చేయగల మొబైల్ పవర్ ప్యాక్ లాంటి వ్యవస్థను ఉపయోగించే అవకాశం ఉంది.
దేశంలో బ్యాటరీ మార్పిడి స్టేషన్లను వ్యవస్థాపించడం ద్వారా హోండా ఈ ప్లాట్ఫామ్ను విస్తరించాలని భావిస్తోంది. అంతేకాకుండా, హోండా బ్యాటరీ ప్యాక్లను చార్జ్ చేయటం కోసం ఓ హోమ్ ఛార్జర్పై కూడా పనిచేస్తుందని ఇటీవలి పేటెంట్లు వెల్లడించాయి. మార్పిడి స్టేషన్లలో ఛార్జర్లు ఒకేసారి రెండు బ్యాటరీ ప్యాక్లను కలిగి ఉంటాయి.
ఇదిలా ఉంటే, స్వాప్ చేయగల బ్యాటరీ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయడానికి కెటిఎమ్, పియాజియో మరియు యమహా వంటి సంస్థలతో హోండా ఓ గ్లోబల్ అసోసియేషన్లోకి కూడా ప్రవేశించింది. ఈ పరిణామాలు భారతదేశం వంటి మార్కెట్లకు చాలా అనుకూలంగా ఉంటాయి.