Just In
- 25 min ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 1 hr ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 2 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 4 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
పరుగులు తీస్తున్న యమహా సేల్స్.. 2021 జనవరి అమ్మకాలు ఇవే
యమహా బైక్, స్కూటర్ తయారీ కంపెనీ ఇటీవల 2021 జనవరి నెలలో జరిగిన అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం, యమహా కంపెనీ యొక్క అమ్మకాలు మునుపటికంటే దాదాపు 54 శాతం పెరుగుదల నమోదు చేసింది. కంపెనీ గత నెలలో మొత్తం 55,151 యూనిట్ల వాహనాలను విక్రయించినట్లు నివేదికల ద్వారా తెలుస్తుంది.
యమహా కంపెనీ గత ఏడాది జనవరిలో మొత్తం 35,913 యూనిట్లను విక్రయించింది. గతేడాది జనవరితో పోలిస్తే యమహా ఇండియా ఈ ఏడాది 19,238 యూనిట్ల వాహనాలను విక్రయించి సానుకూల ఫలితాలను నెలకొల్పింది. దేశంలో అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల విధించిన లాక్ డౌన్ లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
అయితే కరోనా లాక్డౌన్ను తొలగించిన తర్వాత యమహా మోటార్ ఇండియా మంచి పనితీరు కనబరిచింది మరియు సంస్థ అమ్మకాలు ప్రతి నెలా క్రమంగా పెరుగుతున్నాయి. నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే, 2020 డిసెంబర్లో కంపెనీ 39,224 యూనిట్లను విక్రయించింది.
MOST READ:ఆటోమొబైల్ పరిశ్రమపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్ ; ఎలా ఉందో తెలుసా..!
జనవరి 2021 లో, యమహా ఇండియా 2020 డిసెంబర్ కంటే 15,927 యూనిట్లను ఎక్కువగా విక్రయించింది. 2020 డిసెంబర్తో పోలిస్తే గత నెలలో కంపెనీ అమ్మకాలు 40.61 శాతం పెరిగాయి. 50,000 యూనిట్లకు పైగా నెలవారీ అమ్మకాలు జరపడం అనేది కంపెనీకి సానుకూల స్పందన అనే చెప్పాలి.
చాలా రోజుల నుంచి యమహా కంపెనీ యొక్క అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గత నెలలో మంచి అమ్మకాలను చేపట్టింది. గత నెలలో యమహా మోటార్ 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసినప్పటికీ, పెద్ద బ్రాండ్ తయారీదారుల జాబితాలో కంపెనీ ఇప్పటికీ చివరి స్థానంలో ఉంది.
ఈ నెలలో అమ్మకాల పరంగా యమహా ఇండియా టాప్ 7 కంపెనీలలో చోటు దక్కించుకుంది మరియు యమహా తన పోర్ట్ఫోలియోలో చాలా గొప్ప ఉత్పత్తులను కలిగి ఉంది. యమహా యొక్క బిఎస్ 6 పోర్ట్ఫోలియోలో ప్రస్తుతం 125 సిసి స్కూటర్ విభాగంలో ఫాసినో, రే-జెడ్ఆర్ మరియు రే-జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ ఉన్నాయి.
ఇవి మాత్రమే కాకుండా 150 సిసి బైక్ విభాగంలో యమహా ఆర్ 15 వి 3.0 మరియు యమహా ఎంటి-15 (155 సిసి), ఎఫ్జెడ్-ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్ ఎఫ్ఐ బైక్లు ఉన్నాయి. 250 సిసి మోటార్సైకిల్ విభాగంలో ఎఫ్జెడ్ 25 మరియు కొత్త ఎఫ్జెడ్ఎస్ 25 బైక్లు ఉన్నాయి. ఇటీవల యమహా మోటార్ తన కొత్త 2021 యమహా ఆర్ 15 వి 3 ను ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేసింది.
MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి
యమహా కంపెనీ కొత్త కలర్ అప్సన్స్ తో అప్డేటెడ్ మోడల్గా యమహా ఆర్ 15 విని విడుదల చేసింది. ఇండోనేషియా-స్పెక్ బైక్ 155 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజిన్ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 19.3 బిహెచ్పి శక్తిని మరియు 14.7 ఎన్ఎమ్ టార్క్ను అందిస్తుంది. ఈ ఇంజిన్లో, కంపెనీ వివిఎ టెక్నాలజీతో పాటు లిక్విడ్-కూల్డ్ టెక్నాలజీని ఉపయోగించింది. ఏది ఏమైనా యమహా యొక్క అమ్మకాలు పెరగటం చాలా సంతోషకరమైన విషయం.