గత వారం మారుతీ సుజుకీ సంస్థ కార్ల ధరలను పెంచి వినియోగదారున్ని కలవరపెడితే, ఇప్పుడా బాధ్యతను టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు తీసుకున్నాయి. భారతీయ అతి పెద్ద ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ మరియు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి. టాటా మోటార్స్ ఇండికా, ఇండిగో కార్ల మీద రూ.5,000 నుండీ రూ.8,000 వరకూ ధరను పెంచగా, మహీంద్రా అండ్ మహీంద్రా స్పోర్ట్ యుటిలిటీ వాహనం స్కార్పియో మీద రూ.6,400 నుండీ రూ.9,300 వరకూ ధరను పెంచగా, జైలో (Xylo) వాహనం మీద రూ.4,600 నుండీ రూ.4,800 మేర పెంచింది.
ఈ ధరల పెరుగుదలకు కారణం పెరిగిన ముడి సరుకు ధరలే కారణం అని ఈ కంపెనీలు ప్రకటించాయి.