ఫోర్స్ వన్ ఎస్‌యూవీ కోసం ఫోర్స్ మోటార్స్ పెట్టుబడులు

Force Motors
పూణేకు చెందిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ రానున్న రెండేళ్లలో వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడిగా వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు మరియు ఈ నెలలో విడుదల కావాల్సి ఉన్న కంపెనీ తొలి ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం) కోసం, అలాగే మరో కొత్త వాహనం కోసం ఉపయోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ అంతర్గత వనరులు మరియు రుణాల ద్వారా ఫోర్స్ మోటార్స్ ఈ నిధులను సమీకరించుకోనుంది.

అంతేకాకుండా.. కంపెనీ క్యాపిటల్ మార్కెట్ రూట్‌ను ఆశ్రయించి హక్కుల జారీ (రైట్స్ ఇష్యూ)ను ప్రతిపాదించే యోచనలో ఉన్నట్లు ఫోర్స్ గ్రూప్ చైర్మన్ డా. అభయ్ ఫిరోడియా తెలిపారు. కాగా.. ఫోర్స్ వన్ ఎస్‌యూవీ కాకుండా ఫోర్స్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్న మరో మల్టీ పర్పస్ వాహనం (ఎమ్‌పివి) ఉత్పత్తి కోసం ప్లాంటు ఏర్పాటు చేసే విషయమై మధ్యప్రదేశ్ సర్కారుతో కంపెనీ చర్చలు జరుపుతోంది. 2012లో ఈ ఎమ్‌పివి మార్కెట్లోకి రానుంది.

తాము కేవలం ఎస్‌యూవీ, ఎమ్‌పివిలను మాత్రమే తయారు చేస్తామని, సెడాన్‌లను తయారు చేయబోమని, ఈ విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని ఫిరోడియా తెలిపారు. తాము కొత్తగా విడుదల చేయబోయే ఎమ్‌పివి భారత్‌లో టొయోటా ఇన్నోవా మరియు యూరప్ మార్కెట్లో రీనాల్ట్ ఎస్కేప్ మోడళ్లకు ధీటుగా నిలుస్తుందని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
Leading Utility, Commercial vehicle maker Force Motors said it will invest Rs 1,000 crore in the coming two years production capacities and to launch at least two vehicles including the ‘SUV Force One' due to be unveiled later this month.
Story first published: Sunday, August 7, 2011, 15:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X