చంపేసి శవాన్ని కారు మీద వేసుకుని 50 కిమీలు ప్రయాణించిన ఘనుడు
ప్రమాదాలు ఎన్నో రకాలుగా చోటు చేసుకుంటూ ఉంటాయి, కాని ఇంత ఘోరంగా జరగడం ఎప్పుడైనా చూశారా ? ఒక వ్యక్తిని కారుతో డీ కొట్టి ఆ తరువాత ఆ శవాన్ని ఏకంగా 20 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన సంఘన తెలుగు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఈ ఘోరం ప్రమాదం జరిగిన తీరు గురించి మరింత సమాచారం క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇద్దరు వ్యక్తులు కారులో హైదరాబాద్ నుండి విజయవాడకు వారి సొంత మారుతి సుజుకి రిట్జ్ కారులో ప్రాయాణం అయ్యారు. అప్పుటికే వారిరువురూ బాగా తాగి ఉన్నారు.

కారు నల్గొండ జిల్లాలోకి ప్రవేశించిన తరువాత కొమిరేలి వెంకట్ రెడ్డి అనే రైతు పొలానికి వెల్లడానికి రోడ్డు దాటుతుండగా ఈ కారు అత్యధిక వేగంగా రెడ్డిని ఢీ కొట్టింది.

ఆ వేగానికి వెంకట రెడ్డి గాలిలోకి ఎగిరి కారు మీద పడ్డాడు. ఇది గమనించిన కారు డ్రైవర్ ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి దాదాపుగా చాలా దూరమే ప్రయాణించాడు.

ఎపి 09బివై 2725 అనే రిజిస్ట్రేషన్తో గల మారుతి సుజుకి రిట్జ్ కారు ప్రమాదానికి కారణం అయ్యింది. అయితే కారు కొన్ని గ్రామల మీదుగా ప్రయాణిస్తున్నపుడు ఎంతో మంది రెడ్డిని చూసి కేకల వేయడం ప్రారంభించారు.

తప్పించుకున్నామని బ్రాంతిలో ఉన్న కారులోని వ్యక్తులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కారు మీద శవాన్ని దాదాపుగా 20 కిలో మీటర్ల వరకు తీసుకు వచ్చి సరాసరి పోలిసులకు దొరికిపోయారు.

62 ఏళ్ల వయస్సున్న వెంకట్ రెడ్డి ప్రమాదం జరిగిన వెంటనే అక్కడిక్కడే చనిపోయాడు అని నార్కేట్ పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సి హెచ్ మూర్తి తెలిపాడు.

ప్రాంతీయ పోలీస్ అధికారి మోతిరామ్ కథనం ప్రకారం, కారు వ్యక్తి ఏంటి ఎక్కడికి తీసుకెల్తున్నారు అని డ్రైవర్ ప్రశ్నించగా, ఇతనికి ఆరోగ్యం బాగోలేదని అందుకే ఇలా కారు మీద హాస్పిటల్ కు తీసుకువెలుతున్నామని డ్రైవర్ బదులిచ్చాడని తెలిపారు.

ఈ ప్రమాదానికి కారణం అయిన వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రమాదంలో మరణించిన వ్యక్తిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రి తరలించామని అధికారు తెలిపారు.

జాతీయ రవాణా విభాగం వారి అధ్యయనం ప్రకారం ఢిల్లీ మరియు త్రివేండ్రలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం రోడ్డు ప్రమాదం వలన సంభవిస్తోంది. అయితే ప్రమాదానికి కారణం అయిన వారు దొరకకుండా తప్పించుకుంటే గాయపడిన మరియు అలాంటి సందర్భాలలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగాఆర్థిక సహాయాన్ని ఇస్తుంది.
"161 చట్టం ప్రకారం చనిపోయిన వారికి 25,000 రుపాయలు మరియు గాయపడిన వారికి 12,500 రుపాయల వరకు ప్రభుత్వం నుండి సహాయం అందుతుంది". అందుకు ఉదాహరణ ఈ కథనం...
ఫోటోలు: వి6 న్యూస్


Click it and Unblock the Notifications








