Just In
- 1 hr ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 2 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 3 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 6 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
స్నేహితుడి పెళ్లికి వెళ్లి ఏడుగురు దుర్మరణం: ఘటనా స్థలిలోనే అసువులు బాసిన మిత్రులు
ఇంత వరకు జరిగిన ఇన్నోవా ప్రమాదాల్లో దీనిని అత్యంత ఘోరమైనదిగా చెప్పవచ్చు. బుధ వారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఏడు మంది మృతులు స్పాట్లో ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు..
ఏడు
మంది
ఓ
మిత్రుల
బృందం
తమ
స్నేహితుడు
వివాహానికి
హాజరయ్యేందుకు
బుధవారం
రాత్రి
శివమొగ్గ
నుండి
బయలు
దేరారు.
మార్గం
మధ్యలో
భోజనం
చేసి
మళ్లీ
ప్రయాణం
ప్రారంభించారు.
అయితే
ఎదురుగా
వెళుతున్న
లారీ
ప్రమాదం
రూపంలో
ఏడు
మంది
ప్రాణాలను
హరించి
వేసింది.
శివమొగ్గ జిల్లాలోని కిరాతికోప్పకు చెందిన వెంకటేష్ అనే యువకుడి పెళ్లికి ఇతని మిత్ర బృందం శివమొగ్గ నుండి టయోటా ఇన్నోవా వాహనంలో బయలు దేరింది.
తెల్లారితే మిత్రుడి పెళ్లిలో ఆనందంతో గడపాల్సిన వీరిని రాత్రికి రాత్రే మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. భారీ వేగంతో ప్రయాణిస్తున్న ఇన్నోవా ఎదురుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అందరూ అక్కడిక్కడే మృతి చెందారు.
గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో బెంగళూరుకు చెందిన శ్రీధర్, మగదికి చెందిన ప్రవీణ్, మధు సోదరులు, శివమొగ్గకు చెందిన రాజశేఖర్, శికారీపురకు చెందిన రాఘవేంద్ర, చోరడికి చెందిన మంజునాథ్ మరియు మండ్యకు చెందిన మల్లేష్ మొత్తం ఏడు మంది ప్రమాద స్థలిలో అసువులు బాసారు.
ప్రమాదానికి ప్రధాన కారణం...
ఇప్పటి వరకు జరిగిన ఇన్నోవా ప్రమాదాల్లో దీనిని ఘోరమైన ప్రమాదం అని చెప్పవచ్చు. ఎదురుగా పొడవాటి పెద్ద పెద్ద చెక్క మొద్దుల లోడుతో వెళుతున్న లారీని నిద్ర మత్తులో ఉన్న వ్యక్తి భారీ వేగంతో ఢీకొట్టినట్లు స్పష్టమవుతోంది.
వేగంగా దూసుకెళ్లిన ఇన్నోవాలోకి కొయ్య దుంగలు దూసుకెళ్లడంతో ప్రమాదంలో అందరూ మరణించారు. సాగర జాతీయ రహదారి మీద ఆయనూరు వద్ద జరిగిన ప్రమాదంలో కొయ్యదుంగలను క్రేన్ల సాయంతో తొలగించి మృతదేహాలను వెలికి తీశారు.
తన పెళ్లికి వస్తున్న మిత్రులంతా మరణించడంతో వరుడు వెంకటేషన్ ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. అయితే పెద్దలు నచ్చజెప్పడాయనికి ప్రయత్నిస్తున్నారు.
మరణించిన వారు ఎలాగో తిరిగిరారు, అయితే ఇలాంటి ప్రమాదం మన జీవితంలో జరగకూడదంటే వీలైనంత వరకు రహదారి నియమాలను పాటించండి. అతి వేగాన్ని నియంత్రిస్తే ప్రమాదాలు దాదాపు తగ్గిపోతాయి.
కాబట్టి పాఠకులకు చిన్న విన్నపం... పరిమిత వేగంతో ప్రయాణించి క్షేమంగా గమ్యాన్ని చేరుకోండి.