దేశ వ్యాప్తంగా విద్యుత్ వాహనాల వినియోగం పెంచండి-ఫేమ్ ఇండియా
దేశ వ్యాప్తంగా ఎకో ఫ్రెండ్లి మరియు హైబ్రిడ్ వాహనాలను వినియోగించడం వలన ఉద్గారాలను అరికట్టవచ్చని ఫేమ్ ఇండియా ఆర్గనైజేషన్ తెలిపింది ఈ సందర్భంగా ఎకో డ్రైవ్ ర్యాలీని ప్రారంభింస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే ఉద్దేశంతే చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీటికి సంభందించిన ర్యాలి మరియు ప్రదర్శనలను డిల్లీ, జైపూర్ మరియు ఛండీఘర్ నగరాలలో నిర్వహించనున్నారు.
Also Read: కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహస యాత్ర చేస్తున్న బుల్లి కారు.
ఫేమ్(ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్టరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) ఇండియా ఆర్గనైజేషన్ సొసైటి ఆఫ్ మ్యానుఫాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రామాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని వరుసగా నవంబర్ 26, 30 మరియు డిసెంబర్ 7 వ తేదిన ఆయా నగరాలోల నిర్వహించనున్నారు.
Also Read: ప్యారిస్ టెర్రరిస్ట్ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా
హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ ఆప్షన్లను కలిగిన కార్లు, ద్విచక్ర వాహనాలు మరియు బస్సుల తో ఈ ర్యాలీలో పాల్గొన వచ్చు. మరియు ఇందులో పాల్గొనె వారి వాహనాలు ముందుగా అక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ తరువాత ర్యాలీ ఎర్ర కోట నుండి గుర్గావ్ వరకు దాదాపుగా 40 కిలోమీటర్ల దూరం నిర్వహించనున్నారు.
Also Read: ఒక్క సారి ఛార్జింగ్తో 1496 కిలోమీటర్లు చుట్టొచ్చిన కారు.
ఇంకెందు ఆలస్యం మీ దగ్గర కనుక ఎలక్ట్రికా వాహనాలు ఉంటే వాటిని ఈ ఎకో డ్రైవ్ ర్యాలీలో ప్రదర్శించి అందరు ఎలక్ట్రిక్ వాహనాలను కొనే దిశగా మోటివేట్ చేయండి.



Click it and Unblock the Notifications








