Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 5 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వీడియో: ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్యూవీ500 ఢీ - ముగ్గురు దుర్మరణం
పంజాబ్లో అమృత్సర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీలు ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు.
కొన్ని కోట్ల వాహనాలతో బిజి బిజీగా తిరిగే ఇండియన్ రోడ్ల మీద ప్రతి రోజూ కొన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఒకే కారణంతో ఎక్కువ ప్రమాదాలు సంభవించడం మనం గమనిస్తుంటాం. అందులో ఒకటి టైర్ల పేళుడు. ఎంత పెద్ద వాహనాలైనా టైర్లు పేలితే భారీ ప్రమాదం తప్పదు...
అందుకు ఉదాహరణ, పంజాబ్లో అమృత్సర్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీలు ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు.
రోడ్డుకు ఆవలివైపు ఎదురుగా వస్తున్న టయోటా ఫార్చ్యూనర్ టైరు పేళడంతో అదుపు తప్పి డివైడర్ దాటుకుని వ్యతిరేక దిశలో ఉన్న రోడ్డు మీదకు దూసుకొచ్చి మహీంద్రా ఎక్స్యూవీ500 వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.
రెండు రోడ్లను వేరు చేస్తూ మధ్యలో గుబురుగా చెట్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ వెహికల్ ముందుకు ఫార్చ్యూనర్ షడన్దా దూసుకురావడంతో స్పందించి బ్రేకులు వేసే సమయం కూడా లేకపోవడాన్ని వీడియోలో గమనించవచ్చు. బ్రేకులు ప్రెస్ చేసి ఉంటే ఎక్స్యూవీ రియర్ లైట్లు వెలిగేవి.
ఇక్కడ విషాదం ఏమిటంటే మరణించిన ముగ్గురు కూడా ఎక్స్యూవీ500లో ఉన్నవారే అని తెలిసింది. ప్రమాదానికి కారణమైన ఫార్చ్యూనర్ వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతనికి కూడా తీవ్రగాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఐదు మంది ఈ ఘటనలో గాయపడ్డారు.
ఈ ఘోరమైన ప్రమదాం జాతీయ రహదారి 01 మీద జరిగింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు మీద ఎక్స్యూవీ500తో పాటు కొన్ని టూ వీలర్ల కూడా ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదానికి కారణం టైరు పేళడమే అని తెలిసినా, టైరు ఎలా పేళిందో తెలియరాలేదు.
ఫార్చ్యూనర్ డ్రైవర్ మత్తులో ఉన్నట్లు గుర్తించానని ఎక్స్యూవీ 500లో ప్రయాణించిన షీతల్ అరోరా పోలీసులకు వివరించాడు. అయితే, పోలీసులు దీనిని ధృవీకరించలేదు. కానీ అజాగ్రత్తతో నడిపి ప్రమాదానికి కారణమయ్యాడనే కారణంతో డ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేసారు.
నిజానికి టైర్ల ప్రేళుడు వేసవిలో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న ఇండియన్ రోడ్ల మీద వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా టైర్లు పేళిపోతున్నాయి. ఫార్చ్యూనర్ మరియు మహీంద్రా ఎక్స్యూవీ500తో ఢీకొనడాన్ని వీడియోలో వీక్షించగలరు...