Just In
- 32 min ago ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- 1 hr ago పుట్టిన రోజు కొత్త కారు కొన్న ప్రముఖ నటి.. ధర తెలిస్తే మీరూ కొనేస్తారు!
- 2 hrs ago ఈ కార్లు సేఫ్టీలో జీరో.. సేల్స్లో టాప్.. అయినా జనాలు వీటినే ఎందుకు కొంటున్నారు?
- 2 hrs ago మొదలైన Hero Mavrick 440 బైక్ డెలివరీస్.. బుక్ చేసుకున్న వారికి పండగే!
Don't Miss
- Sports KKR vs RR: అందుకే తుది జట్టులో మార్పులు చేశాం: సంజూ శాంసన్
- News లోక్సభ ఎన్నికల వేళ భారీ ఎన్కౌంటర్: మావో అగ్రనేతతోపాటు 18 మంది నక్సల్స్ మృతి
- Lifestyle రామసేతు ఇక ఎప్పటికీ మిస్టరీగానే ఉంటుందా.. శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే..!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Movies Paayal Rajput: మెరుపుల డ్రెస్లో మంగళవారం బ్యూటీ మెస్మరైజింగ్ షో.. ఎంతందంగా ఉందో కదా!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
34 లక్షల విలువైన విజయ్ మాల్యా లగ్జరీ కార్లు రూ. 1.4 లక్షలకే!
బ్యాంకు బకాయిలను ఎగ్గొట్టి దేశం విడిచి పరారైన విజయ్ మాల్యా ఆస్తులను బ్యాకులు ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా మాల్యాకు చెందిన రెండు కార్లు వేలంలో రూ. 1.4 లక్షలకు అమ్ముడుపోయాయి.
బ్యాంకు బకాయిలను ఎగ్గొట్టి దేశం విడిచి పరారైన విజయ్ మాల్యా ఆస్తులను బ్యాకులు ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా మాల్యాకు చెందిన రెండు కార్లు వేలంలో రూ. 1.4 లక్షలకు అమ్ముడుపోయాయి. నిజానికి వీటి ధర రూ. 34 లక్షలు.
కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కోసం బ్యాంకుల నుండి సుమారుగా 9 వేల కోట్ల రుపాయలను మాల్యా అప్పుగా తీసుకున్నాడు. బకాయిలను చెల్లించని లిక్కర్ కింగ్ మాల్యా దేశం విడిచి పారిపోయాడు.
Recommended Video
అప్పులిచ్చిన బ్యాంకులు చేసేది లేక మాల్యాకు సంభందించిన దొరికిన ఆస్తులను దొరికినట్లుగా వేలం వస్తున్నాయి. అందులో భాగంగా మాల్యాకు చెందిన రెండు కార్లకు ఆన్లైన్ ద్వారా ముంబై నుండి వేలం నిర్వహించారు.
ఈ వేలంలో హుబ్లీకి చెందిన హనుమంత రెడ్డి అనే వ్యాపారవేత్త అత్యంత చౌక ధరలతో సొంతం చేసుకున్నాడు. సుమారుగా రూ. 34 లక్షలు విలువ చేసే రెండు కార్లను కేవలం రూ. 1.4 లక్షలకే సొంతం చేసుకున్నాడు.
విజయ్ మాల్యా పేరు మీద ఉన్న, మాల్యా వినియోగించిన హ్యుందాయ్ సొనాటా గోల్డ్ కారు మార్కెట్ అసలు ధర రూ. 13.15 లక్షలు మరియు హోండా అకార్డ్ కారు ధర రూ. 21 లక్షలుగా ఉండగా, హనుమంత రెడ్డి సొనాటా గోల్డ్ను రూ. 40 వేలకు మరియు అకార్డ్ కారును లక్ష రుపాయలకే కొనుగోలు చేశాడు.
హనుమంత రెడ్డికి ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ కార్లను వేలం ద్వారా సొంతం చేసుకునే అలవాటు ఉంది. అందులో భాగంగా ముంబాయ్కు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ నిర్వహించిన వేలంలో మాల్యా వాడిన MH 01 DA 7227 మరియు MH 01 DA 1235 కార్లను సరసమైన ధరకు సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం రెండు కార్లు కూడా మంచి కండీషన్లో ఉన్నట్లు తెలిపాడు. హనుమంత్ రెడ్డి మాల్యా కార్లను డెలివరీ తీసుకున్న తర్వాతా అధిక ధరకు తమ విక్రయించాలని చాలా మంది డిమాండ్ చేయగా, అందుకు నిరాకరించానని తెలిపాడు.
విజయ్ మాల్యాకు చెందిన రోల్స్ రాయిస్ కార్ల నుండి చిన్న చిన్న కార్ల వరకు మొత్తం 52 కార్లకు వేలం నిర్వహించినట్లు తెలిసింది. ఆస్తులతో పాటు వ్యక్తిగత విమానాన్ని కూడా వేలంలో విక్రయించేశారు.
ఇదంతా కూడా ప్రభుత్వం, రాజకీయ నాయకులు మరియు బ్యాంకులు కుమ్మక్కయ్యి విజయ్ మాల్యాకు కోటాను కోట్ల రుపాయల భారత ప్రజల సొమ్మును దోచిపెట్టి పరోక్షంగా లాభపడ్డాయని, మాల్యా ద్వారా జరిగిన నష్టాన్ని తన ఆస్తులకు వేలం ద్వారా తిరిగి పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు బ్యాంకులు నటిస్తున్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు.