Just In
- 1 hr ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 17 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 19 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
Don't Miss
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇండియన్ ఎయిర్ఫోర్స్ తొలి మహిళా పైలట్ అవని చతుర్వేది
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో కేవలం పురుషులు మాత్రమే యుద్ద విమానాలకు పైలట్లుగా వ్యవహరించారు. అయితే, ఈ లింగ వివక్షతకు ముగింపు పలుకుతూ ఫిబ్రవరి 19 న అవని చతుర్వేది భారతదేశపు తొలి యుద్ద విమానాల పైలట్గా చరిత్ర
కుటుంబ బాధ్యతలు భర్త మరియు పిల్లల ఆలన పాలనా చూసుకోవడంలో స్త్రీమూర్తి జీవితం తలమునకలైపోతోంది. మది నిండా ఎన్నో ఆలోచనలు, ఆశలు, ఆశయాలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేని పరిస్థితుల్లో ఎందరో మహిళలు నాలుగు గోడల మధ్య జీవనానికి పరిమితమైపోయారు.
Recommended Video
కానీ, ఇటీవల కాలంలో పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో మేటిగా రాణిస్తున్నారు. పుట్టినప్పటి నుండి పెళ్లి వరకు అడుగడుగునా ఎదురయ్యే అవాంతరాలను ఎదుర్కొని ముందడగు వేస్తూ మేలైన విజయాలు సాధిస్తున్నారు. మహిళలకు అసాధ్యం అనే అన్ని రంగాల్లో కూడా తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మధ్యనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ తొలి మహిళా పైలట్గా ఎంపికైన అవని చతుర్వేది గురించి ప్రత్యేక కథనం....
కొన్ని దశాబ్దాల పాటు ఇండియన్ ఎయిర్ఫోర్స్లో కేవలం పురుషులు మాత్రమే యుద్ద విమానాలకు పైలట్లుగా వ్యవహరించారు. అయితే, ఈ లింగ వివక్షతకు ముగింపు పలుకుతూ ఫిబ్రవరి 19 న అవని చతుర్వేది భారతదేశపు తొలి యుద్ద విమానాల పైలట్గా చరిత్ర పుటల్లోకి తొలి పేజీని లిఖించింది.
సరిగ్గా మూడు వారాల క్రితం భారత మహిళ అవని చతుర్వేది మిగ్ 21 బిసోన్ యుద్ద విమానాన్ని ఒటరిగా నడిపి ఇండియన్ ఎయిర్ఫోర్స్ తొలి మహిళా పైలట్గా నిలిచింది.
మధ్యప్రదేశ్ లోని చిన్న పట్టణం నుండి వచ్చిన అవని చతుర్వేది యుద్ద విమాన పైలట్గా రాణించడమే కాకుండా భారతదేశంలో లింగ సమానత్వం చుట్టూ ఉన్న అనాగరిక ఆంక్షలను తొలగించడంలో విశేషంగా దోహదపడింది.
సరిగ్గా ఏడాదిన్నర క్రితం, జూన్ 2016లో, అవని చతుర్వేదితో సహా భావన కాంత్ మరియు మోహనా సింగ్ ముగ్గురూ భారతదేశపు తొలి మహిళా ఫైటర్ జెట్ పైలట్లుగా నిలిచి చరిత్రను తిరగరాశారు.
కొన్ని దశాబ్దాల పాటు, మహిళల ప్రెగ్నెన్సీ, మానసిక మరియు శారీరక సామర్థ్యం మరియు రుతుస్రావం వంటి అంశాల కారణంగా అధిక ఒత్తిడితో కూడిన పనులు మరియు సైనిక బలగాల్లో మహిళలు రాణించలేరనే ఒక ఏకాభిప్రాయం పురుషుల్లో ఉంది.
"యుద్ద మరియు సైనిక బలగాల్లో మరియు ఎక్కువ ఒత్తిడి గల పని ప్రదేశాల్లో పురుషులు మాత్రమే పని చేయగలరనే ఒక శాశ్వితమైన ధృడ నమ్మకం సహజ సిద్దంగా అందిరిలోను ఉంటుంది." ఈ కారణం చేతనే మహిళలు ఈ రంగాల్లో రాణించలేకపోతున్నారని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త మరియు చరిత్రకారిణి వ్రాసిన "ఉమెన్ ఇన్ ది ఆర్మీ", ఎకనామిక్ అండ్ పొలిటకల్ వీక్లీ ఆగష్టులో 2010లో ప్రచురితమైన అనే కథనంలో పేర్కొంది.
పురుషులు మాత్రమే ఈ వృత్తిలో రాణించగలరనే నమ్మకాన్ని అస్థిరపరిచేందుకు అవని చతుర్వేది చాలా కష్టపడింది. హైదరాబాదులోని దుండిగల్ సమీపంలో ఉన్న ట్రైనింగ్ అకాడమీలో కఠినమైన శిక్షణ తీసుకుంది.
అవని చతుర్వేది కుటుంబ సభ్యులు కూడా వెన్నుగా నిలిచారు. సమాజంలో లింగ వివక్షతను ప్రక్కనపెట్టి మొత్తానికి అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
ఇప్పుడు, ఎంతో మంది అమ్మాయిలు పైటర్ పైలట్లు కావాలనుకుంటున్నారు. మొదట్లో అందరూ వాణిజ్య విమానాలకు పైలట్లుగా పనిచేయాలని భావిస్తారు. కానీ, ఇప్పుడు అవని చతుర్వేదిని ఆదర్శంగా తీసుకొన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో యుద్ద విమానాలకు పైలట్లుగా రాణించేందుకు ప్రయత్నిస్తున్నారు.