అదృశ్య రైలును సృష్టిస్తున్న జపాన్
ప్రయాణ సాధనాలలో చాలా మందికి ఎంతో ఇష్టమైనవి రైళ్లు కారణం తక్కువ ప్రయాణ ధర, భద్రత సౌకర్యవంతం వంటి ఎన్నో కారణాలు మన మనసుల్లో రైలు ప్రయాణం అనగానే ఎగిరి గంతేసేవిధంగా స్థానం సంపాదించుకున్నాయి. ఇండియన్ రైల్వే పరంగా ఇవీ మన ఆలోచనలు.
కానీ మన ఆలోచనలకు ఏ మాత్రం అంతుచిక్కని విధంగా జపాన్ అదృశ్య రైళ్లను తయారు చేస్తోంది. అవునా అని ప్రపంచ దేశాలు ముక్కు మీద వేలేసుకుని మరీ ఆశ్చర్యపోతున్నాయి. కంటికి కనిపించని రైలు అంటే మాటలా మరి, అందుకే ఈ అదృశ్య రైలు సంగతేలేంటా అని ఆరా తీసి క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

సీబు సంస్థ, ఇది జపాన్లోని ప్రముక హోల్డింగ్స్ సంస్థ హోటల్స్ మరియు రైళ్లకు ఇది జపాన్లో బాగా పేరు గాంచింది. అయితే ఈ సంస్థ చాలా వరకు అర్కిటెక్ట్లను ఒక అదృశ్య రైలును నిర్మించడానికి ఎంపిక చేసుకుంది.

జపాన్లోని ఇబరాకి పెర్ఫెక్ఛర్ అనే ప్రాంతంలో రాష్ట్రంలో ఉండే కజుయో సెజిమా అనే ఆర్కిటెక్ట్ ఈ ప్రాజెక్ట్ను ఎంచుకున్నారు.

59 ఏళ్ల వయస్సున్న ఈ ఆర్కిటెక్చర్ చూడ్డానికి అత్భుమైన ఎన్నో భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసింది.

ఈ పూర్తి చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి ఫ్రాన్స్లోని లోవర్ లెన్స్ మ్యూజియమ్. ఈ ప్రాజెక్ట్కు గాను ఈమెకు ప్రెస్టేజియస్ ప్రిట్జ్కర్ ప్రైజ్ కూడా వరించింది.

ఈ సంస్థ యొక్క యానివర్సీ సంవస్తరాన్ని పురస్కరించుకుని 2018 నాటికి ఈ ఆద్యశ్య రైలు పూర్తి స్థాయిలో తయారు చేయనున్నట్లు తెలిపారు.

ఒక్క సారి ఆ రైలును ప్రారంభిస్తే టోక్యో మరియు జపాన్లోని ఇతర ప్రధాన నగరాలను కలుపుతుంది.

అదృశ్య నిర్మాణం ఎలా సాధ్యపడుతుంది అనే కదా మీ అనుమానం? నిర్మాణం రంగంలో ఆరితేరిన సెజిమా ఈ రైలు మీద ఉపయోగించే పదర్థాలను వాతావరణంతో పోల్చినపుడు రెండు కూడా అచ్చంగా మ్యాచ్ అవుతాయి అని తెలిపింది. ఇంటువంటి వాటి ద్వారా రైలు బాహ్య బాగాలను తయారు చేయనున్నారు.

ప్రమాదాలు ?
సాధారణంగా కంటికి కనిపించే వాటి ద్వారా అధిక స్థాయిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, మరి ఇలాంటి కంటికి కనిపించని రైళ్లు వస్తే ప్రమాదాలు ఏ మేరకు పెరుగుతాయో ఎమో....!

డ్రైవర్ తెలివికి జోహార్...!!
రాజమౌళి ఈగలా పగపట్టిన ఆవు


Click it and Unblock the Notifications








