పెట్రోల్ & డీజిల్ కంటే జెట్ ఫ్యూయెల్ చాలా చీప్.. ఎందుకంటే?
భారతదేశంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల కారణంగా సాధారణ ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో పెట్రోల్ & డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేశాయి. అయితే బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 109.53 కాగా డీజిల్ ధర రూ. 100.37 కి చేరింది. హైదరాబాద్ నగరంలో అయితే పెట్రోల్ ధర రూ. 110.09 మరియు డీజిల్ ధర రూ. 103.18 గా ఉంది. ఇక ముంబై నగరంలో అయితే ఏకంగా రూ. 111 దాటేసింది.

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరల కంటే కూడా జెట్ ఫ్యూయల్ తక్కువ ధరకు లభిస్తోంది. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఒక లీటరు జెట్ ఫ్యూయల్ ధర రూ. 79 గా ఉంది. దీన్ని బట్టి చూస్తే భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరల కంటే కూడా జెట్ ఫ్యూయల్ ధర రూ. 33 తక్కువ.

జెట్ ఫ్యూయల్ అంటే?
సాధారణంగా పెట్రోల్ మరియు డీజిల్ వంటి మాటలు మాత్రమే చాలామంది విని ఉంటారు. అయితే మనం ఇక్కడ చెప్పుకుంటున్న జెట్ ఫ్యూయెల్ అనే మాట కొంతమందికి కొత్తగా అనిపిస్తుంది. కావున జెట్ ఫ్యూయెల్ అంటే ఏమిటి మరియు అది ఎందుకు ఉపయోగిస్తారు అనే విషయాలను కూడా ఇక్కడ పరిశీలిద్దాం.

జెట్ ఫ్యూయల్ అనేది విమానాలను నడపడానికి ఉపయోగించే ఇంధనం. జెట్ ఇంధనం అన్ని రకాల పౌర విమానయాన, సైనిక విమాన మరియు హెలికాప్టర్లలో ఉపయోగించబడుతుంది. జెట్ ఇంధనం కూడా పెట్రోల్ మరియు డీజిల్ లాంటి ఒక ఇంధనం. కానీ ఈ ఇంధనాన్ని ఉపయోగించి సాధారణ వాహనాలను నడపడం సాధ్యం కాదు.

జెట్ ఫ్యూయల్ ధరలు తగ్గడానికి కారణం:
జెట్ ఫ్యూయల్ పైన టాక్స్ తగ్గడానికి ప్రధాన కారణం దాని ధర తక్కువగా ఉండటం. దేశంలో పెట్రోల్పై 60 శాతం, డీజిల్పై 54 శాతం టాక్స్ విధించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రూ. 32.80 శాతం మరియు రూ. 31.80 శాతం ఎక్సైజ్ టాక్స్ కూడా విధించింది. ఈతి టాక్స్ ల కారణంగానే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు క్రమంగా పెరిగిపోయాయి.

టాక్స్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్ రిటైల్ ధరలను నిర్ణయిస్తాయి. వీటితో పోలిస్తే, లీటరు జెట్ ఫ్యూయెల్ ధర రూ. 79 ఉంది. జెట్ ఫ్యూయెల్ ధర కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. కానీ వాటిపైన ఉన్న టాక్స్ రేటు చాలా తక్కువగా ఉండటం వల్ల పెట్రోల్ మరియు డీజిల్ కంటే చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం జెట్ ఫ్యూయెల్ పైన 11 శాతం ఎక్సైజ్ టాక్స్ విధిస్తుంది. కానీ జెట్ ఫ్యూయల్ ఓవర్ హెడ్ VAT రేటు 0 - 30%గా సెట్ చేయబడింది. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో, బ్యారెల్ ముడి చమురు ధర సుమారు $ 86 కి పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల ప్రభావం భారతదేశంలో 20 - 25 రోజుల తర్వాత కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కారణంగా భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడానికి ప్రభుత్వం కారణమని పేర్కొంది.

అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిర్ణయించాయి. కానీ పెట్రోల్ మరియు డీజిల్పై 50% కంటే ఎక్కువ టాక్స్ విధించబడింది. ఈ పరిమాణాన్ని తగ్గించడం వలన భారతదేశంలో ఇంధన ధరలు తగ్గుతాయి. అయితే ఈ మొత్తాన్ని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఏ మాత్రం సుముఖత చూపడం లేదు. గత మూడు వారాల్లో పెట్రోల్ & డీజిల్ ధరలు ఏకంగా 15 రెట్లు పెరిగినట్లు సమాచారం.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్తాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు భారతదేశంలో ఇంధనం (పెట్రోల్ మరియు డీజిల్) ధరలను మామూలుగా సవరించాయి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధర మరియు డాలర్ మారకం రేటుపై ఆధారపడి ఉంటాయి.

కొత్త ఇంధన ధరలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు అమలులోకి వస్తాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు సెప్టెంబర్ 24 నుండి డీజిల్ ధరలను మరియు సెప్టెంబర్ 28 నుండి పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్పై అధిక పన్నులు పెరుగుతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరల పెంపుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్, డీలర్ కమిషన్ మరియు సరుకు ఛార్జీలు కూడా దీనిపైనా ఉంటాయి, వీటన్నింటి కారణంగా ఇంధన ధరలకు రెక్కలొస్తున్నాయి.

అయితే భారతదేశంలో ఇంధన ధరలు GST పరిధిలోకి వస్తే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలను GST పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయి, ఇంధన దార్ల GST కిందికి వస్తే, రాష్ట్రాలకు వచ్చే ఆదాయం చాలా వరకు తగ్గుతుంది. కావున ఇంధన ధరలు GST కిందికి రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతే కాకుండా మరోవైపు ఇంధనంపై ఎక్సైజ్ టాక్స్ తగ్గించే అవకాశం ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

గత రెండేళ్లలో ఇంధనంపై ఎక్సైజ్ టాక్స్ గణనీయంగా పెరిగింది. ఇది కూడా ఇంధనాల ధర నిరంతర పెరుగడానికి కారణం అయ్యింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరుగుదల దిశవైపు పరుగులు పెట్టడం ప్రారంభించాయి. ఆ ధరలు కాస్త పెరిగి పెరిగి ఇప్పుడు 100 రూపాయలు దాటేశాయి. పెరుగుతున్న ధరలను సామాన్య ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి వారు ఆసక్తి చూపుతున్నారు. రాబోయే కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు రానున్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
NOTE: ఈ ఆర్టికల్ లో ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.


Click it and Unblock the Notifications








