Just In
- 11 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 12 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీకు తెలుసా.. పిల్లల్ని బైక్ పెట్రోల్ ట్యాంకుపై తీసుకెళ్లటాన్ని నిషేధం
బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణం. ఈ ట్రాఫిక్ సమస్య భారతదేశంలో మరీ ఎక్కువగా ఉంది. వాహనదారులు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం సర్వసాధారణం. ఈ విధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలు కొత్త గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ కారణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదాలను నివారించడానికి కొత్త నియమాలను రూపొందిస్తోంది. ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన వాహనదారులను తగ్గించే నోటిఫికేషన్ విడుదల చేసింది.
పిల్లలను ప్రమాదాల నుండి రక్షించడానికి హోం శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వ్యుల ప్రకారం, పిల్లలు బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ మీద మరియు స్కూటర్ల ముందు కూర్చోవడం లేదా నిలబడటం శిక్షార్హమైన నేరం.
పిల్లలను ఈ విధంగా బైక్లపై తీసుకురావడం సురక్షితం కాదు. పిల్లలు ద్విచక్ర వాహనం ముందు కూర్చోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
పిల్లలను బైక్ పెట్రోల్ ట్యాంకులపై ఉంచడం వారిని మరింత ప్రమాదంలో పడేస్తుంది. స్కూటర్ ముందు భాగం కూడా ప్రమాదకరం. అంతే కాకుండా పిల్లలను పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టి వాహనాన్ని నియంత్రించడం కూడా కష్టతరమైన పని.
వాహనాలు సరైన అదుపులో లేకుంటే అది పిల్లల యొక్క మరణానికి కారణం అవుతుంది. ఇది మరొకరికి బాధ కలిగిస్తుంది. దీనిని నివారించడానికి కేరళ ప్రభుత్వం ఈ రకమైన ఉత్తర్వులు జారీ చేసింది.
పిల్లలు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. కొన్నేళ్ల క్రితం చెన్నైలో జరిగిన సంఘటన దీనికి నిదర్శనం. ఈ సంఘటనలో 5 సంవత్సరాల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడానికి ద్విచక్ర వాహనంలో అదే ప్రాంతంలోని ఒక హోటల్కు వెళ్లాడు.
రాత్రి భోజనం తరువాత, అతను తన తండ్రి మరియు తల్లితో కలిసి అదే ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వచ్చాడు. బాలుడు బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ మీద నిలబడి ఉన్నాడు. బైక్ పెరంబర్ వంతెన వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు చనిపోయాడు. పిల్లలు ద్విచక్ర వాహనాల ముందు కూర్చున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.
అంతే కాకుండా కొన్ని సందర్భాలలో పిల్లలను ముందు కోర్చోబెట్టుకోవడం వల్ల వాహనాన్ని సమతుల్యత చేయలేము. ఆ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
గమనిక: ఈ చిత్రాలు కేవలం సూచన కోసం మాత్రమే