Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దేవుడు చెప్పాడని జాతీయ రహదారి మీద పెద్ద గొయ్యి తవ్వేసారు!
శివలింగం ఉందనే అప నమ్మకంతో తెలంగాణలో జాతీయ రహదారి మీద పెద్ద గొయ్యిని తవ్విన ఘటనను. మతాన్ని అడ్డుపెట్టుకొని కొందరు చేసే మూర్ఖపు పనులకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
మతాన్ని అడ్డుపెట్టుకొని కొంత మంది చెప్పే మాయమాటలను నమ్మి చాలా మంది మూర్ఖంగా మోసపోతున్న కథనాలను రోజుకొక్కటి చెప్పున చూస్తుంటాం. శివలింగం ఉందనే అప నమ్మకంతో తెలంగాణలో జాతీయ రహదారి మీద పెద్ద గొయ్యిని తవ్విన ఘటనను ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో మూఢ నమ్మకాలను నమ్ముతూ ఎలాంటి పనులకైనా ఒడిగడుతున్నారనేది అక్షరాలా సత్యం. సినిమా నటులు నుండి పొలిటీషియన్స్తో పాటు సాధార ప్రజల వరకు అందరూ ఈ ఆధునిక కాలంలో కొందరు వ్యక్తులు చెప్పే మాయమాటలను నమ్ముతున్నారు.
వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఇలాంటివి ఇప్పుడు మతాలు మరియు దేవుళ్ల వరకు పాకిపోయాయి. అందుకు నిదర్శనం తెలంగాణలో జరిగిన సంఘటన. శివ లింగం రోడ్డు క్రింది భాగంలో ఉందని ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఏకంగా జాతీయ రహదారిని తవ్వేశారు.
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామ పరిధిలో ఉన్న జాతీయ రహదారిని జెసిబిలతో తవ్వించారు గ్రామ ప్రజలు. లఖన్ మనోజ్ స్వామీజీగా చెప్పుకునే వ్యక్తి తెలిపిన మేరకు గ్రామ సర్పంచ్ మరియు ఊరి ప్రజలంతా ఈ ఘటనకు ఒడిగట్టారు.
విరాల్లోకి వెలితే పెంబర్తి గ్రామంలో స్వామీజీగా చెలామణి లఖన్ మనోజ్ కలలోకి శివుడు పలుమార్లు దర్శనమిచ్చి, రోడ్డు క్రింద ఉన్న శివ లింగాన్ని సేకరించి పెద్ద గుడిని నిర్మించాలని ఆజ్ఞాపించాడని గ్రామస్థులకు వివరించాడు.
మరికొంత మంది వ్యక్తులతో కలిసి, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి తొలుత కొన్ని పూజలు చేసి జెసిబి మరియు ప్రొక్లెయిన్ల సహాయంతో పెద్ద గొయ్యిని తీయించాడు. అయితే అక్కడ శివ లింగం లేదా శివునికి సంభందించిన ఏవీ కూడా లభ్యం కాలేదు.
దీని గురించి ఆ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, "లఖన్ మనోజ్ శివ భక్తుడు. మరియు గత మూడేళ్లుగా శివుని ప్రతి రూపమైన శివ లింగం రోడ్డు క్రింది భాగంలో ఉన్నట్లు కల వస్తోందని చెప్పేవాడు. అంతే కాకుండా ప్రతి సోమవారం కూడా శివ లింగం ఉందని భావిస్తున్న ప్రదేశం వద్దకు వెళ్లి పూజలు చేస్తుంటే నిజమే అనుకున్నామని" చెప్పుకొచ్చాడు.
ఈ విషయం తెలుసుకున్న చుట్టు ప్రక్కల వారంతా అక్కడి చేరుకోవడంతో జాతీయ రహదారి మీద ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్ను క్లియర్ చేసి, లఖన్ మనోజ్ మరియు సర్పంచ్ లతో పాటు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు.
గ్రామస్తులు మరియు స్వామీజీ సూచనలతో తవ్వకం చేపట్టి ఏకంగా 20 అడుగులు గొయ్యిని తవ్వారు. చివరికి అందులో ఏమీ దొరకలేదు. ప్రభుత్వం ఆస్తులను ధ్వంసపరిచినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.