Just In
- 30 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అత్యంత విలాసవంతమైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్
పదవ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఘనంగా ముంగిసింది. ఈ సారి ఐపిఎల్ అనేక మంది క్రికెటర్ల తమ ప్రతిభా పాఠవాలతో వెలుగులోకి వెచ్చారు. అందులో ఒకరు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున్న ఆడిన రిషభ్ పంత్.
ఐపిల్ ప్రారంభానికి ముందే వివిధ జట్ల యాజమాన్యం క్రికెటర్లను వేలం ద్వారా దక్కించుకుంటారు. అందులో భాగంగానే రిషభ్ పంత్ను క్రికెటర్ను వేలంలో రూ. 1.9 కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడి అద్బుత ఆట తీరును ప్రదర్శించిన రిషభ్ పంత్ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి లగ్జరీ ఎస్యూవీని కొనుగోలు చేశాడు.
తన ఆట తీరుతో జట్టు మొత్తాన్ని ఆకట్టుకున్న రిషభ్ పంత్ తనకు తానుగా ఓ లగ్జరీ కారును బహుమానంగా ఇచ్చుకున్నట్లు పంత్ అభిమాన బృందం ఫేస్బుక్లో కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది. .
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ శక్తివంతమైన ఎస్యూవీ. దీని ఎక్ట్సీరియర్ డిజైన్ శైలి మరియు ఇంటీరియర్ ఫీచర్లు దీని ఆఫ్ రోడ్ లక్షణాలను స్పష్టం చేస్తాయి.
విలాసవంతమైన ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్లో సౌకర్యవంతమైన లగ్జరీ సీట్లు, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్టు చేసుకునే సదుపాయం ఉన్న సీట్లు, ఆటోమేటిక్ ప్యానరోమిక్ సన్ రూఫ్ మరియు ఇతర ప్రధానమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
భద్రత పరంగా మెర్సిడెస్ బెంజ్ ఈ జిఎల్సిలో బ్రేకింగ్ పనితీరును పెంచేందుకు ఇందులో ఇంటెలిజెంట్ ఇంటర్వెన్షన్ పరిజ్ఞానాన్ని అందించడం జరిగింది. ఒక వేళ నీటిలో డ్రైవ్ చేస్తున్నపుడు డిస్క్ బ్రేకులకు తమే తగలకుండా చేస్తుంది.
సాంకేతికంగా మెర్సిడెస్ బెంజ్ ఈ జిఎల్సి లగ్జరీ ఎస్యూవీ రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, జిఎల్సి 300 4మ్యాటిక్ మరియు జిఎల్సి 220డి 4మ్యాటిక్.
జిఎల్సి 300 4మ్యాటిక్ వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా బిహెచ్పి పవర్ మరియు ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును, ఈ శక్తివంతమైన ఇంజన్కు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్ అనుసంధానం కలదు.
జిఎల్సి 220డి 4మ్యాటిక్ వేరియంట్లో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 168బిహెచ్పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనికి కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనుసంధానం కలదు.
ఐపిఎల్ సీజన్ ముగిసిన తరువాత రిషభ్ పంత్ కొనుగోలు చేసిన ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి లగ్జరీ ఎస్యూవీని సుమారుగా 65 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది.