Just In
- 4 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 4 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 6 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోడ్డుపై అకస్మాత్తుగా కాన్వాయ్ ఆపిన తమిళనాడు సిఎం.. తరువాత ఏం జరిగిందంటే?
భారతదేశంలో కరోనా సెకండ్ చాలా వేవ్ ఎక్కువగా వ్యాపిస్తోంది. మన దేశంలో కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు తమిళనాడు కూడా ఉంది. తమిళనాడులో కూడా కోయంబత్తూర్ మరియు మదురై వంటి ఇతర నగరాల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.
నివేదికల ప్రకారం ప్రస్తుతం తమిళనాడులో ప్రతిరోజూ 30,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. కావున తమిళనాడు ప్రభుత్వం దీనిని దృష్టిలో ఉంచుకుని కఠినమైన చర్యలతో లాక్ డౌన్ ప్రకటించింది. అంతే కాకుండా సంబంధిత అధికారులతో ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎంకే స్టాలిన్ సంప్రదింపులు జరుపుతున్నారు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇందులో భాగంగానే తిరుపూర్, సేలం మరియు కోయంబత్తూర్ తో సహా ఇతర ఐదు జిల్లాల అధికారులను కలిశారు. ఇటీవల తిరుపూర్, సేలం జిల్లాలను పరిశీలించడానికి స్టాలిన్ సాయంత్రం కోయంబత్తూరు జిల్లాకు వెళ్లారు.
MOST READ:దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా
కరోనా తీవ్రత అధికంగా ఉన్న కారణంగా కోయంబత్తూరులోని కొడిచియా క్యాంపస్లోని కరోనా స్పెషాలిటీ క్లినిక్లో మునుపటికంటే అదనంగా 820 బెడ్లు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా కుమారగురు ఇంజనీరింగ్ కళాశాలలో 360 పడకలతో కొత్త కరోనా కేర్ సెంటర్ ప్రారంభించబడింది.
ఈ రెండు ప్రాంతాలను సందర్శించిన తర్వాత సీఎం స్టాలిన్ స్టాలిన్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశం తరువాత, స్టాలిన్ చెన్నైకి బయలుదేరటానికి వారి ఎస్కార్ట్ బృందంతో బయలుదేరింది. కుమారగురు కాలేజీ నుండి బయటకు వస్తున్నప్పుడు, స్టాలిన్ తమ వాహనాన్ని వెంటనే ఆపమని చెప్పారు.
MOST READ:బైకర్స్ తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి.. లేకుంటే?
సాధారణంగా కరోనా చాలా ఎక్కువగా వ్యాపిస్తున్న సమయంలో ప్రజాప్రతినిధులు ప్రజలను కలుసుకోవడానికి లేదా ప్రజలు వీరిని కలుసుకోవడానికి అనుమతించరు. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఆ మహిళను పిలిచి తన అభ్యర్థనను స్వీకరించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ మహిళా ఎంతగానో సంతోషించింది.
సీఎం ఆదేశాలమేరకు ఎస్కార్ట్ ఆపిన వెంటనే అందరూ అప్రమత్తమయ్యారు. కారు ఆగిన వెంటనే తమ కోసం రోడ్డుపై వేచి చూస్తున్న మహిళను పిలిపించారు. ఆ మహిళ సీఎం ని సంప్రదించి ఒక పిటిషన్ ను అందించింది.
MOST READ:సూపర్ లుక్లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..
ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ప్రజల అవసరాలకు తగిన విధంగా స్పందించిన తమిళనాడు సీఎం నిజంగా చాల గ్రేట్. కరోనా సమయంలో కూడా ఆమె అభ్యర్థనను స్వీకరించి వారికి చాలా ఆనందాన్ని కలిగించారు.