ఇండియాలో ఇక ఎలక్ట్రికల్ స్కూటర్స్ పరంపర కోనసాగనుందని ఆటోమొబైల్స్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రికల్ వాహానాల అభివృద్దిని దృష్టిలోపెట్టుకోని ఇండియన్ గవర్నమెంట్ దాదాపుగా రూ 95కోట్ల ప్రేరేపకములు ప్రకటించింది. ఈస్కీముని ఇండియన్ గవర్నమెంట్ పదకోండవ పంచవర్ష ప్రణాళికలో కూడా పెట్టనున్నారని సమాచారం. నవంబర్ 11నుంచి తక్కువ స్పీడ్ కలిగినటువంటి ఫ్యాక్టరీ టూవీలర్స్ వాహానాలకు రూ4000, అంతేవిధంగా ఎక్కువ స్పీడ్ కలిగినటువంటి టూవీలర్స్ కు రూ 5000, ఏడుగురు కూర్చోనేవిధంగా ఉన్నటువంటి సెవన్ సీటర్ వెహికల్స్ కు రూ 6000, ఇకపోతే ఎలక్ట్రికల్ కారుకి రూ లక్ష వరకు ప్రేరేపకములు ఇవ్వనున్నట్లు తెలిపారు.
యావరేజిగా ఎలక్ట్రికల్ వాహానాలు స్పీడ్ రేంజిని బట్టి వాటి ధరలు రూ 25000నుండి రూ40000 వరకు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఇండియాలో సంవత్సరానకి గాను 85000యూనిట్లు తయారవుతున్నాయని అన్నారు. ఎక్కువగా ఈఎలక్ట్రికల్ వాహానాలను హీరో ఎలక్ట్రిక్, అవాన్ సైకిల్స్ మరియు బియస్ ఎ ఆటోమొబైల్స్ తయూరు చేస్తున్నాయని అన్నారు.