Just In
- 51 min ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 4 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 5 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
Don't Miss
- Movies NTR31: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుపై బిగ్ ట్విస్ట్.. ఫ్యాన్స్కు ఇది బిగ్ షాకే!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తున్న జావా కొత్త బైకులు
భారతదేశపు అత్యంత పురాతణ ద్విచక్ర వాహన తయారీ సంస్థ క్లాసిక్ లెజెండ్స్ ఒకానొక కాలంలో దివాలా తీసిన సంగతి తెలిసిందే. అయితే, మార్కెట్లో జావా మోటార్ సైకిళ్లకు ఉన్న డిమాండ్ మరియు ఓల్డ్ స్టైల్ క్లాసిక్ బైకులు సేల్స్ ఆశాజనకంగా ఉండటంతో దేశీయ ఆటోమోటివ్ దిగ్గజం మహీంద్రా గ్రూపు జావా బైకులను తయారు చేసే క్లాసిక్ లెజెండ్స్ సంస్థను కొనుగోలు చేసి పునరుద్దరించింది.
జావా పాత కాలం నాటి స్టైలింగ్ మరియు అత్యాధునిక ఇంజన్లతో జావా మరియు జావా ఫార్టీ టూ అనే రెండు మోడళ్లను విపణిలోకి విడుదల చేసి కస్టమర్లకు డెలివరీలు కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో అత్యంత కీలకమైన డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందిస్తామని గత ఏడాది డిసెంబర్లో సంస్థ సీఈఓ ప్రకటించారు.
జావా మరియు జావా ఫార్టీ టూ డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ మోడళ్లను పూర్తి స్థాయిలో సిద్దం అయ్యాయని, అతి త్వరలోనే వీటిని డెలివరీ ఇస్తామని.. సోషల్ మీడియా ద్వారా ఓ కస్టమర్ నుండి ఎదురైన ప్రశ్నకు క్లాసిక్ లెజెండ్స్ సంస్థ సీఈఓ అనుపమ్ థారేజా స్పష్టం చేశారు.
డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ గల జావా బైకుల డెలివరీలను అతి త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు తప్పితే... ఏ తేదీ నుండి అనే క్లారిటీ ఇవ్వలేదు. అంతే కాకుండా, జావా సంస్థ ఇప్పటి వరకు ఎన్ని బైకులను విక్రయించింది, ఎన్ని బుకింగ్స్ జరిగాయనే విషయాన్ని ఇంత వరకు వెల్లడించకుండా గోప్యంగా ఉంచింది.
జావా మోటార్ సైకిళ్లను ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని పితంపూర్లో ఉన్న మహీంద్రా ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ జావా మరియు జావా ఫార్టీ టూ అనే రెండు మోడళ్లను తయారు చేస్తున్నారు.
జావా మరియు జావా ఫార్టీ టూ రెండు క్లాసిక్ బైకుల్లో 293సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూలింగ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 27బిహెచ్పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండింటిలో కూడా పాత డిజైన్ డీఎన్ఏ మరియు నూతన టెక్నాలజీ జోడింపుతో క్లాసిక్ స్టైలో ఉన్నాయి. గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, బ్లాక్ ఫినిషింగ్ గల ఎలిమెంట్స్ ఎంతగానో ఆకట్టుకుంటాయి.
డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ జావా బైకు ధర రూ. 1.72 లక్షలు మరియు జావా ఫార్టీ టూ బైకు ధర రూ. 1.63 లక్షలు ఎక్స్-షోరూమ్గా ఉన్నట్లు క్లాసిక్ లెజెండ్స్ సంస్థ పేర్కొంది. సింగల్ ఛానల్ ఏబీఎస్ ఉన్నవాటితో పోల్చితే వీటి ధరలు రూ. 8,000 వరకు ఎక్కువగా ఉంది.