Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భారత్లో విడుదలైన స్మార్ట్ ఫీచర్స్ ఈవీ స్కూటర్స్ ; ధర & ఇతర వివరాలు
భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం రోజు రోజుకి పెరుగుతోంది, ఈ క్రమంలో వాహన తయారీ సంస్థలు కూడా కొత్త అవాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టాయి. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత అధీకృత సంస్థ అయిన ఈవీ కంపెనీ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అవి అట్రియో మరియు అహావా ఎలక్ట్రిక్ స్కూటర్లు. అట్రియో స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 90 నుంచి 100 కి.మీ వరకు ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది.

అహావా స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అయిన తరువాత 60 నుండి 70 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. దేశీయ మార్కెట్లో అట్రియో స్కూటర్ ధర రూ. 64,900 కాగా, అహావా స్కూటర్ ధర రూ. 55,900. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ అనేక ఆధునిక ఫీచర్లతో విడుదల చేసింది.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ఈ రెండు స్కూటర్లలోని బ్యాటరీపై కంపెనీ 1 సంవత్సరాల వారంటీ మరియు కస్టమర్ సర్వీస్ కోసం 5 సంవత్సరాల వారంటీని అందించింది. అట్రియో స్కూటర్లో జియో ట్యాగింగ్, ఫెన్సింగ్, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్, రిమోట్ లాకింగ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి.

కంపెనీ అందించిన నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 15 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ స్కూటర్ పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు, ఇంధనం కోసం ఖర్చు చేసిన డబ్బును కూడా ఆదా చేస్తుంది.
MOST READ:370 కి.మీ. కేవలం 4 గంటల్లో చేరుకున్న అంబులెన్స్ డ్రైవర్.. ఎందుకో తెలుసా ?

ఈ స్కూటర్ల కొనుగోలు కోసం సంస్థ సులభమైన ఫైనాన్సింగ్ అప్సన్స్ కూడా ప్రవేశపెట్టింది. అట్రియో మోడల్ డ్యూయల్ టోన్ బ్లాక్, రెడ్ మరియు మోనోటోన్ గ్రే అనే రెండు రంగులలో అమ్ముడవుతోంది.

250 వాట్ల ఎలక్ట్రిక్ మోటారును అహావా స్కూటర్లో అమర్చారు. ఈ మోడల్లో కంపెనీ అన్ని రకాల స్మార్ట్ ఫీచర్లను అమలు చేసింది. అహావా స్కూటర్ బ్లూ డ్యూయల్ మరియు రెడ్ బ్లాక్ అనే రెండు డ్యూయల్ టోన్ కలర్స్ లో అమ్ముడవుతోంది.
MOST READ:భారత నావీలో మరో బ్రహ్మాస్త్రం.. శత్రువుల గుండెల్లో గుబేల్..

ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 52 డీలర్లు ఉన్నారు మరియు వచ్చే ఏడాది ఈ సంఖ్యను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలును సులభతరం చేయడానికి, ఈవీ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఆధారిత ఇఎంఐ ఫైనాన్స్ సంస్థ గెస్ట్ మనీ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఈ భాగస్వామ్యం ద్వారా వినియోగదారులు సరసమైన ఇఎంఐ అప్సన్స్ ద్వారా సంస్థ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫైనాన్సియల్ సర్వీస్ పొందే విధానం ఇప్పుడు కాగిత రహితమైనది, కావున ఇప్పుడు ఆన్లైన్లో లేదా స్మార్ట్ఫోన్ ద్వారా పూర్తి చేయవచ్చు. వినియోగదారులు కెవైసి యొక్క ఫార్మాలిటీని ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు.
MOST READ: భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

మీరు 3 నెలలు 6 నెలలు లేదా 12 నెలల ఇఎంఐ మధ్య ఎంచుకోవచ్చు. ఈవీ ఇండియా తూర్పు భారతదేశంలో మొదటి ఆటో సంస్థ. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఒడిశాలో ఉంది. ఈవీ ఇండియాకు దేశవ్యాప్తంగా 63 డీలర్ల నెట్వర్క్ ఉంది. వచ్చే ఏడాది 200 వేర్వేరు ప్రదేశాల్లో ఎక్కువ మంది డీలర్లను ఓపెన్ చేయాలనుకుంటుంది.

ఈవీ ఇండియా దేశంలో సరికొత్త టెక్నాలజీతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తుంది. ఈ స్కూటర్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ ప్లగ్ అంగో బ్రాండ్ కింద ఛార్జింగ్ స్టేషన్లను కూడా నిర్మిస్తోంది.