Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 6 hrs ago
భారత్లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తమిళనాడులో అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని పెట్టనున్న ఓలా ; వివరాలు
దేశంలో అతిపెద్ద మొబిలిటీ ప్రొవైడర్ సంస్థ ఓలా, భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మార్చడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం ఓలా రాష్ట్రంలో 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి కర్మాగారాన్ని స్థాపించడానికి సిద్దమైంది.

ఓలా స్థాపించనున్న ఈ కర్మాగారం నిర్మాణం పూర్తయిన తర్వాత సుమారు 10,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పించబడతాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రకారం, ఈ తయారీ కర్మాగారం ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ కేంద్రంగా ఉండబోతోంది. ఇందులో ఏటా 2 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలు తయారు చేయబడతాయి.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకారం, ఓలా యొక్క కర్మాగారం, స్వావలంబన కలిగిన భారతదేశాన్ని సృష్టించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించగలదు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, స్థానిక తయారీని ప్రోత్సహించడం, ఉద్యోగాలు సృష్టించడం వంటి పెద్ద రంగాలలో ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది.
MOST READ:డ్రైవర్రహిత వాహనాల టెస్ట్ కోసం తయారవుతున్న కొత్త కృత్రిమ నగరం.. ఎక్కడో తెలుసా ?

ఈ కర్మాగారం దేశంలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి చాలాబాగా ఉపయోగపడుతుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కర్మాగారం భారతదేశం యొక్క పర్యావరణ వ్యవస్థను సక్రియం చేస్తుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా చేస్తుంది.

భారతదేశం తన ప్రత్యేక నైపుణ్యాలు, మానవశక్తి మరియు జనాభాతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రపంచ కేంద్రంగా ఉందని ఓలా అభిప్రాయపడ్డారు. ఓలా యొక్క కర్మాగారం భారతదేశంలో మాత్రమే కాకుండా యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా మరియు ప్రపంచవ్యాప్త మార్కెట్లలో కూడా వినియోగదారుల డిమాండ్ను తీర్చనుంది.
MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వనున్న సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

రాబోయే నెలల్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క మొదటి శ్రేణిని విడుదల చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. దీనిపై ఓలా చైర్మన్ మరియు సిఇఒ 'భవీష్ అగర్వాల్' మాట్లాడుతూ "ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే మా ప్రణాళికలను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము" అని అన్నారు.

ఇది ఓలాకు నిజంగా ఒక గొప్ప సదావకాశం అనే చెప్పాలి. మేము వినియోగదారుల అవసరాలకు అనుకూలంగా వాహనాలను తాయారు చేస్తాము, ఇది ఎలక్ట్రిక్ విభాగంలో దేశానికీ గర్వకారణంగా తీర్చి దిద్దుతామని అయన అన్నారు. ఏది ఏమైనా అలా మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడం వల్ల చాలామందికి ఉపాధి కల్పించడంతో పాటు, మన దేశం కూడా ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇతరదేశాలకు పోటీ ఇవ్వగలదు.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]