Just In
- 7 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 10 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 12 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 16 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసిన స్మార్ట్రాన్ ; పూర్తి వివరాలు
దేశీయ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త వాహనాలు విడుదలవుతున్నాయి. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీదారులు కూడా కొత్త రకమైన మరియు అప్డేటెడ్ ఫీచర్స్ తో వాహనాలను తయారు చేసి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా స్మార్ట్రాన్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్గో బైక్ "టీబైక్ ఫ్లెక్స్" ను విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
లీడింగ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ స్మార్ట్రాన్ కార్గో భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ని రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ అనేక కొత్త మరియు అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ మంచి సాంకేతిక లక్షణాలను కలిగి ఉంటుంది. స్మార్ట్రాన్ ఇండియా లాంచ్ చేసిన ఈ కొత్త టీబైక్ ఫ్లెక్స్ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 40,000 గా నిర్ణయించడం జరిగింది.
MOST READ:వెహికల్పై పేర్లు ఉంటే ఇప్పుడే తీసెయ్యండి.. లేకుంటే ఏమవుతుందో తెలుసా..!
సాధారణంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ఈ కామర్స్ వినియోగదారులు, ఫుడ్ డెలివెరీ ఆపరేటర్లు మొదలైన వారు ఉపయోగించుకోవడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుందని స్మార్ట్రాన్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ లింగారెడ్డి తెలిపారు.
40 వేల రూపాయల ఖరీదైన ఈ ఎలక్ట్రిక్ బైక్ 40 కేజీల వరకు బరువును మోయగలదు, కావున అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివారు చాలా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఒకే పూర్తి ఛార్జ్లో 75 నుండి 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి
ఈ సమాచారాన్ని స్మార్ట్రాన్ ఒక ప్రకటనలో అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా, డైబైక్ ఫ్లెక్స్ ఎలక్ట్రిక్ టూ-వీలర్ను వివిధ రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందించాలని యోచిస్తోంది. ఇవి 75 నుండి 120 కి.మీ వరకు బ్యాటరీ ప్యాక్లలో లభిస్తాయి. ఇటువంటి బ్యాటరీ సామర్థ్యం మరియు చాలా తక్కువ ఖర్చు ఉండటం వలన ఎక్కువమందిని ఆకర్షించడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. కావున ఎక్కువమంది ఈ ఎలక్ట్రిక్ బైక్ వినియోగించే అవకాశం ఉంది.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి
ఈ కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో జియో-ఫెన్సింగ్, సెల్ ఫోన్ కనెక్టివిటీ, రిమోట్ లాక్ మరియు అన్లాక్ మరియు ఇంటిగ్రేటెడ్ డెకర్ వంటి అనేక రకాల అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ లో ఉపయోగించే బ్యాటరీ దాదాపు 1,50,000 కిలోమీటర్లు ప్రయాణించే వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ బైక్ లో ఇన్ని ప్రత్యకమైన ఫీచర్స్ ఉన్నాయా అంటే కొంత ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంలో మరిన్ని ఫీచర్స్ కూడా అందిస్తామని తయారీదారు ప్రకటించారు. ఏది ఏమైనా ఈ బైక్ నగర ప్రయాణాలకు చాలా ననుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ఓ ఉన్న ఫీచర్స్ ఎక్కువమంది యువ వాహనదారులను ఆకర్షించే అవకాశం ఉంది.
MOST READ:భయంకర ప్రమాదం నుంచి చిటికెలో తపించుకున్న యువకులు [వీడియో]