Just In
- 1 hr ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 3 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 3 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- Technology 6.9 అంగుళాల డిస్ప్లే, 64MP కెమెరా ఫోల్డబుల్ ఫోన్పై భారీ డిస్కౌంట్.. అమెజాన్ సేల్ పూర్తి వివరాలు..!
- News అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు: ప్రధాని మోదీ కితాబు.. సెలబ్రేషన్స్ ఇలా
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పెట్రోల్ ధర పెరిగితే నాకేం.. నాకు నేను తయారుచేసుకున్న బైక్ ఉంది కదా అంటున్న తెలంగాణ వ్యక్తి
మన దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు రోజురోజుకి భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 100 రూపాయలు దాటేశాయి. ఈ ధరల పెరుగుదల సామాన్య మానవుడిపై పెనుభారాన్ని మోపుతాయి. దీని వల్ల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గించే సంకేతాలు ఏ మాత్రం కనిపించడం లేదు.
ఇంధన ధరల పెరుగుదల కారణంగా చాలామంది వాహనదారులు వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ఆసక్తి కనపరుస్తున్నారు. మరికొంత మంది అయితే తమ వాహనాలను కొన్ని మార్పులతో ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాలను మాడిఫై చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటన మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
నివేదికల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ ప్రాంతనికి చెందిన 'విద్యాసాగర్' తన పాత బజాజ్ మోటార్సైకిల్ను ఎలక్ట్రిక్ మోటార్సైకిల్గా మార్చాడు. పెరుగుతున్న పెట్రోల్ ధరల సమస్య నుండి తనను తాను రక్షించుకోవడానికి యితడు ఈ విధమైన అద్భుతాన్ని సృష్టించాడు.
పాత బజాజ్ మోటార్ సైకిల్ను ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్గా మార్చే ప్రయత్నంలో అతను పెట్రోల్ ఇంజిన్ను తొలగించి బ్యాటరీలు, కన్వర్టర్ మరియు మోటారును అమర్చాడు. 42 సంవత్సరాల వయసున్న విద్యాసాగర్ సాదారణంగా ఒక టీవీ మెకానిక్. కానీ అతను పెట్రోల్ బైక్ను ఎలక్ట్రిక్ బైక్గా మార్చుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు.
విద్యాసాగర్ ఈ బైక్ తయారీ కోసం 10 వేలు ఖర్చు పెట్టి నాలుగు 30 ah 12-వోల్ట్ బ్యాటరీలను కొనుగోలు చేసాడు. అంతే కాకుండా అతడు దీనికోసం 48 వి మోటారుతో కూడిన ఎలక్ట్రిక్ బైక్ కన్వర్షన్ కిట్ మరియు మరో రూ .7,500 ఖర్చు చేసి కన్వర్టర్ను కూడా కొనుగోలు చేశాడు.
ఎలక్ట్రిక్ బైక్ తయారీ కోసం అన్నింటిని కొనుగోలు చేసిన తరువాత ఆ బైక్ యొక్క పెట్రోల్ ఇంజిన్ తొలగించి, దాని స్థానంలో బ్యాటరీలు మరియు మోటారును ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ బైక్ రూపొందించాడు. ప్రస్తుతం ఈ బైక్ను కిలోమీటరు ప్రయాణించడానికి కేవలం 0.2 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని అతడు తెలిపాడు.
ఈ ఎలక్ట్రిక్ బైక్ గురించి విద్యాసాగర్ మాట్లాడుతూ, ఈ బైక్ తయారీకి మొత్తం తనకు 20,000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పాడు. అయితే ఈ బైక్ వాళ్ళ ఇప్పుడు పెట్రోల్ నింపుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి నెలా 3,000 రూపాయలు ఆదా చేస్తున్నట్లు కూడా చెప్పాడు. కానీ ఈ బైక్ యొక్క బ్యాటరీని ప్రతిరోజూ సుమారు 5 గంటలు పాటు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
ఈ బైక్ లో అమర్చిన బ్యాటరీకి వీలైనంతవరకు రాత్రిలో ఛార్జింగ్ వేసుకోవచ్చు కావున, ఇది మరీ అసాధ్యమైన పని మాత్రం కాదు. అంతే కాకుండా విద్యాసాగర్ బైక్ నడుస్తున్నప్పుడు బ్యాటరీ ఛార్జ్ అయ్యే సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు చెప్పాడు.
విద్యాసాగర్ చెప్పినట్లు ఇది కూడా జరిగితే,బైక్ ఛార్జ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం వుండదు. పెట్రోల్ బైక్ను ఎలక్ట్రిక్ బైక్గా మార్చిన విద్యాసాగర్ కి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విధానం చాలా బాగుండటంతో చాలామంది వాహనదారులు ఇలాంటి బైక్ తయారుచేసుకోవాలి ఆలోచిస్తున్నారు.