Just In
- 28 min ago
టెస్టింగ్ దశలో మరోసారి కనిపించిన జీప్ కంపాస్ 7 సీటర్.. లాంచ్ ఎప్పుడంటే?
- 1 hr ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 1 hr ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 2 hrs ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
Don't Miss
- News
లాలూకు భారీ ఊరట- గడ్డి స్కాంలో నాలుగో కేసులో ఎట్టకేలకు బెయిల్..
- Movies
చావు కబురు చల్లగా.. ఓటీటీలో మరింత కొత్తగా..
- Sports
రోహిత్ అండ్ టీమ్పై అదరగొట్టే ట్రాక్ రికార్డ్: వార్నర్ బెస్ట్ స్కోర్ ఇదే
- Lifestyle
ఆరోగ్య చిట్కాలు: దంతాల సంరక్షణ కోసం 'కొబ్బరి నూనె' ఇలా వాడండి!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ.2500 పెరగనున్న హీరో మోటార్సైకిళ్లు మరియు స్కూటర్ల ధరలు
ఏప్రిల్ 2021 నెల నుండి వాహన తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ కూడా వచ్చే నెల నుండి తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

కొత్త ధరలు ఏప్రిల్ 1, 2021 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలోనే హీరో మోటోకార్ప్ తమ టూవీలర్ల ధరలను పెంచడం ఇది వరుసగా రెండవసారి. జనవరి 2021లో కంపెనీ తమ టూవీలర్ల ధరలను సుమారు రూ.1,500 వరకూ పెంచింది.

కాగా, ఈసారి రూ.2,500 వరకు ధరల పెంచుతున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. కంపెనీ విక్రయిస్తున్న అన్ని మోటార్సైకిళ్లు మరియు స్కూటర్లపై ఈ ధరల పెంపు వర్తిస్తుందని, అయితే మోడల్ మరియు వేరియంట్ను బట్టి ఇది భిన్నంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
MOST READ:హైదరాబాద్ నగరంలో 40 మందికి పైగా వాహనదారులు అరెస్ట్.. కారణం ఇదే

ఏయే మోడల్ మీద ఎంత మేర ధరలు పెరుగుతాయనేది వచ్చే నెల ప్రారంభంలో తెలుస్తుంది. పెరిగిన వస్తువుల వ్యయాల ప్రభావాన్ని పాక్షికంగా పూడ్చడానికి ధరల పెరుగుదల అవసరమని, అందుకే ఈ భారాన్ని కస్టమర్లపైకి బదిలీ చేయక తప్పడం లేదని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది.

మార్కెట్లో గత కొంత కాలంగా స్టీల్/ఉక్కు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు దేశంలో ఇప్పటికీ కోవిడ్-19 మహమ్మారి వలన ఏర్పడి సప్లయ్ అంతరాయాలు ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద సవాళ్లుగా మారాయి.
MOST READ:నువ్వా నేనా అంటూ జరిగిన 2021 రెడ్ బుల్ ఏస్ రేస్ హైలెట్స్ & ఫలితాలు.. వచ్చేశాయ్

గత సంవత్సరం ఆటో పరిశ్రమ అనేక సవాళ్లను మరియు సమస్యలను ఎదుర్కుంది. ఏప్రిల్-మే నెలల్లోని సంపూర్ణ లాక్డౌన్ కారణంగా, ఆటోమొబైల్ కంపెనీలు సున్నా విక్రయాలను చూశాయి, వాహనాల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశాయి.

ప్రస్తుతం వాహనాల అమ్మకాలు గతేడాది కన్నా మెరుగ్గానే ఉన్నప్పటికీ, అధిక ఇన్పుట్ ఖర్చుల కారణంగా పెరిగిన ఉత్పాదక వ్యయాన్ని వాహన తయారీదారులు కస్టమర్లపైకి బదిలీ చేస్తున్నారు. ఇటీవలే మారుతి సుజుకి ఇండియా కూడా ఇదే కారణం చెప్పి తమ కార్ల ధరలను ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.
MOST READ:బిఎమ్డబ్ల్యూ 730ఎల్డి లగ్జరీ సెడాన్ రివ్యూ.. లేటెస్ట్ ఫీచర్స్ & వివరాలు

హీరో మోటోకార్ప్ బ్రాండ్కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ ఇటీవలే తమ సరికొత్త డెస్టిని 125 'ప్లాటినం' ఎడిషన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో ఈ కొత్త హీరో డెస్టిని 125 ప్లాటినం వేరియంట్ ధర రూ.72,050 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ)గా ఉంది.

కొత్త హీరో డెస్టిని 125 ప్లాటినం విశిష్టమైన డ్యూయెల్ టోన్ డిజైన్ను కలిగి ఉంటుంది. ఇందులోని 124.6 సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్ బ్రాండ్ యొక్క ‘ఎక్స్సెన్స్ టెక్నాలజీ'తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 9 బిహెచ్పి పవర్ను మరియు 10.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
MOST READ:మీకు తెలుసా.. పైలట్ సీట్లలో గొర్రె చర్మం ఎందుకు ఉపయోగిస్తారో.. అయితే ఇది చూడండి