వావ్ అమేజింగ్.. ఒక్క స్కూటర్ బ్రాండ్, 2.5 కోట్ల మంది కస్టమర్స్
భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ చరిత్రను తిరగరాసిన మోడల్ హోండా యాక్టివా. ఈ స్కూటర్ భారత మార్కెట్లో విడుదలై సుమారు రెండు దశాబ్ధాలు పూర్తి కావస్తోంది. గడచిన 20 ఏళ్లలో హోండా యాక్టివా భారతదేశంలో 2.5 కోట్ల మంది కస్టమర్లకు చేరువైంది.

హోండా యాక్టివా స్కూటర్ బ్రాండ్ 25 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో, భారత ఆటోమొబైల్స్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్గా అవతరించిందని హోండా టూ-వీలర్స్ ఇండియా ప్రకటించింది. స్కూటర్లకు ఆదరణ అంతంత మాత్రం ఉన్నరోజుల్లో యాక్టివా మార్కెట్లోకి ప్రవేశించింది.

హోండా యాక్టివాను తొలిసారిగా 2001లో విడుదల చేశారు. ఆ తర్వాత మొదటి ఐదేళ్లలోనే ఈ స్కూటర్ 10 లక్షల (1 మిలియన్) యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. మొదట్లో ఈ స్కూటర్ 102సీసీ ఇంజన్తో విడుదలైంది. 2004-05 సంవత్సరంలో కంపెనీ ఇందులో మరింత శక్తివంతమైన 110సీసీ ఇంజన్ వెర్షన్ను ప్రవేశపెట్టింది.

ఈ సెకండ్ జనరేషన్ హోండా యాక్టివా స్కూటర్లో తొలిసారిగా కాంబీ బ్రేక్ సిస్టమ్ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ వలన ఏ బ్రేక్ లివర్ ప్రెస్ చేసినా రెండు (ముందు, వెనుక) బ్రేకులు ఒకేసారి పనిచేసి, మెరుగైన బ్రేకింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

ఆ తర్వాత్ 2014-15 ప్రాంతంలో హోండా ఈకో టెక్నాలజీతో కూడిన ఇంజన్ను మరియు ఇందులో చిన్న స్కూటర్హా 'యాక్టివా ఐ' మోడల్ను హోండా ప్రవేశపెట్టింది. ఈ మార్పుల వలన యాక్టివా బ్రాండ్ సేల్స్ మరింత పెరిగాయి.

గత 2015 సంవత్సరం పూర్తయ్యే నాటికి హోండా యాక్టివా బ్రాండ్ భారత మార్కెట్లో 15 వసంతాలను పూర్తి చేసుకుంది. అప్పటికే ఈ బ్రాండ్ అమ్మకాలు 1 కోటి మార్కును చేరుకున్నాయి. కాగా, అనూహ్యంగా గత ఐదేళ్లలో మునుపెన్నడూ లేనంగా ఈ స్కూటర్ అమ్మకాలు జరిగాయి.

కేవలం ఐదేళ్లలోనే (2016-2020 సమయంలో) హోండా అదనంగా 1.5 కోట్ల మంది కొత్త కస్టమర్లను ఆకర్షించింది. దీంతో మొత్తంగా గత 20 ఏళ్ల కాలానికి గానూ హోండా యాక్టివా 2.5 కోట్ల అమ్మకాల మైలురాయిని చేరుకోగలిగింది.

హోండా 2014లో 125సీసీ ఇంజన్తో కూడిన యాక్టివా స్కూటర్ను విడుదల చేసింది. దేశంలో అప్పుడదే మొట్టమదటి 125సీసీ ఇంజన్ కలిగిన స్కూటర్. ఈ మోడల్ను హోండా యాక్టివా 3జి (థర్డ్ జనరేషన్) పేరుతో సరికొత్త డిజైన్తో విడుదల చేశారు. ఈ మోడల్ ఎక్కువ కస్టమర్లను ఆకర్షించింది.

హోండా యాక్టివా స్కూటర్ అమ్మకాలు ఎంతలా పెరిగాయంటే, గత 2015లో ఇది హీరో మోటోకార్ప్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడయ్యే మోటార్సైకిల్ అమ్మకాలను సైతం అధిగమించేంతలా పెరిగాయి. అప్పట్లో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ద్విచక్ర వాహనంగా మరియు స్కూటర్గా సంచలనం సృష్టించింది.

ఇటీవలి కాలంలో భారతదేశంలో బిఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి రావడంతో 2019లో కంపెనీ యాక్టివా 6జి పేరుతో ఆరవ తరం యాక్టివా 125 స్కూటర్ను అప్గ్రేడెడ్ ఇంజన్తో మార్కెట్లో విడుదల చేసింది. ఇదే సమయంలో ఈ స్కూటర్లో అనేక కొత్త ఫీచర్లను కూడా జోడించారు.

ఇందులోని కొత్త బిఎస్6 ఇంజన్ మెరుగైన మైలేజ్ను ఆఫర్ చేయడమే కాకుండా మంచి పనితీరును కూడా అందిస్తుంది. ఈ స్కూటర్లో తొలిసారిగా సైలెంట్ ఏసిజి స్టార్టర్ను ఉపయోగించారు. ఇది మునుపటి క్రాంకింగ్ స్టార్టర్ మోటార్ మాదిరిగా కాకుండా చాలా సైలెంట్గా స్కూటర్ స్టార్ట్ అయ్యేందుకు సహకరిస్తుంది.

ఇంకా ఇందులో ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కూడా పరిచయం చేశారు. ఇంజన్ కొంత సమయం పాటు ఆన్లో ఉండి, ఎలాంటి కదలిక లేకపోయినట్లయితే ఇది గుర్తించి, ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. ఆ వెంటనే యాక్సిలరేటర్ను తిప్పగానే ఆటోమేటిక్గా ఇంజన్ ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ ఇంధనాన్ని ఆదా చేసి, మైలేజ్ను పెంచడంలో సహకరిస్తుంది.


Click it and Unblock the Notifications








