Just In
- 25 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- News సీట్ల మార్పులో బీజేపీ కొత్త ట్విస్ట్- చంద్రబాబు నిర్ణయం ఏంటి..!!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
దేశవ్యాప్తంగా వెస్పా, ఆప్రిలియా షోరూమ్లను రీఓపెన్ చేసిన పియాజియో
కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా గడచిన ఏప్రిల్ నెల నుండి దాదాపు రెండు నెలల పాటు దేశం లాక్డౌన్లో ఉన్న పరిస్థితులను చూశాం. అయితే, ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వైరస్ తీవ్రత తగ్గడంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది, వ్యాపారాలు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో, పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పివిపిఎల్) భారతదేశం అంతటా తమ వెస్పా మరియు అప్రిలియా టూవీలర్ డీలర్షిప్ కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో, గడచిన ఏప్రిల్ మరియు మే నెల మధ్యలో కంపెనీ తమ డీలర్షిప్లను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసినదే.
మహారాష్ట్రలోని బారామతి కేంద్రంగా ఉన్న పివిపిఎల్ ఇటాలియన్ ఆటో మేజర్ పియాజియో గ్రూప్ యొక్క పూర్తిగా యాజమాన్యంలో ఉంది. ఇది త్రీ-వీలర్ విభాగంలో అతిపెద్ద నెట్వర్క్ను కలిగి ఉంది మరియు వెస్పా, అప్రిలియా వంటి బ్రాండ్ల క్రింద అనేక రకాల ప్రీమియం స్కూటర్లను తయారు చేస్తుంది.
ఈ విషయం గురించి పియాజియో ఇండియా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డియెగో గ్రాఫి మాట్లాడుతూ, కోవిడ్-19 యొక్క సెకండ్ వేవ్ వంటి క్లిష్ట సమయాల్లో తాము తమ డీలర్లతో కలిసి పని చేస్తున్నామని, ఈ లాక్డౌన్ల సమయంలో తమ కస్టమర్ల యొక్క ఆందోళనను కూడా దృష్టిలో ఉంచుకుని, లాక్డౌన్ సమయంలో ముగిసిన అసలైన పరికరాల వారంటీ మరియు ఉచిత సేవలను కూడా పొడగించామని ఆయన చెప్పారు.
గడచిన ఏప్రిల్, మే నెల మధ్య కాలంలో ముగిసిన వారంటీ మరియు ఫ్రీ సర్వీసుల గడువును కంపెనీ జులై 31, 2021వ తేదీ వరకు పొడగించింది. తాజా పరిస్థితుల తర్వాత, ఇప్పుడు తమ డీలర్షిప్లు అన్ని వాహన అమ్మకాలు మరియు సర్వీస్ అవసరాలను తీరుస్తాయని, కరోనా మార్గదర్శకాలను అనుసరించి అన్ని భద్రతా చర్యలు పాటిస్తున్నామని ఆయన చెప్పారు.
కోవిడ్-19 ఫస్ట్ వేవ్ సమయంలో కూడా పియాజియో ఏప్రిల్ 2020లో, భారతీయ వినియోగదారుల కోసం ఇలాంటి సేవా పొడిగింపులను ప్రకటించింది. అదే సమయంలో, భారత మార్కెట్లో మరింత చురుకుగా ఉండటానికి ఈ సంవత్సరం కంపెనీకి పెద్ద ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంది.
ఇందులో భాగంగా, పియాజియో త్వరలోనే భారత మార్కెట్లో పలు కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తామని కంపెనీ ప్రకటించింది. అమ్మకాలను పెంచడంతో పాటు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడానికి డీలర్షిప్ల సంఖ్యను మరింత పెంచాలని పియాజియో యోచిస్తోంది.
ప్రస్తుతం, ఈ బ్రాండ్కు దేశంలో 725కి పైగా వాహన డీలర్షిప్లు మరియు 1,100 కి పైగా టచ్ పాయింట్లు ఉన్నాయి. అదనంగా, మార్కెటింగ్ విభాగాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి సరఫరాదారులు మరియు రిటైలర్ల యొక్క బలమైన నెట్వర్క్ కూడా తమకు ఉందని కంపెనీ పేర్కొంది.