Just In
- 2 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 3 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దేశీయ మార్కెట్లో రూ. 63,000 ఖరీదైన సైకిల్ విడుదల: వివరాలు
భారతీయ మార్కెట్లో కార్లకు మరియు బైకులకు మాత్రమే కాదు సైకిల్స్ కి కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం పెరుగుతున్న ఇంధన (పెట్రోల్ & డీజిల్) ధరలు. అంతే కాకుండా ప్రజలు తమ ఆరోగ్యం మీద కూడా ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారు. ఈ కారణంగా సైకిల్ మార్కెట్లో కూడా బాగా వృద్ధి చెందింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సైకిల్స్ తయారీ కంపెనీలన్నీ కూడా కొత్త కొత్త సైకిల్స్ దేశీయ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.
ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో 'నైంటీ వన్ సైకిల్స్' (Ninety One Cycles) తన 'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' (KTM Chicago Disc 271) అనే సైకిల్ విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో నైంటీ వన్ సైకిల్స్ (Ninety One Cycles) విడుదల చేసిన కొత్త 'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' (KTM Chicago Disc 271) సైకిల్ ప్రారంభ ధర రూ.63,000. ఇది చూడటానికి చాలా సింపుల్ గా మరియు చాలా స్టైలిష్ గా కూడా ఉంది. అది మాత్రమే కాకుండా ఈ సైకిల్ ఏ రకమైన ట్రాక్లోనైనా నడపగల సామర్థ్యం కలిగి ఉన్న ఆల్-టెర్రైన్ సైకిల్ అని కంపెనీ స్పష్టం చేసింది.
కంపెనీ విడుదల చేసిన ఈ సైకిల్ కేవలం యువకులకు మాత్రమే కాకుండా వివిధ వయస్కులకు కూడా అనుకూలంగా ఉండే విధంగా మూడు ఫ్రేమ్ సైజుల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సమయంలో ఈ సైకిల్ అల్యూమినియం ఫ్రేమ్ తో తయారు చేయబడింది కావున బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ సైకిల్ బరువు కేవళం 15 కేజీలు మాత్రమే.
మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఈ సైకిల్ అన్ని రకాల ట్రాక్లపైన నడపడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీనికోసం కంపెనీ ఇందులో 27.5-ఇంచెస్ ఆల్-టెర్రైన్ టైర్లను ఉపయోగించింది. అంతే కాకూండా ఇందులో మెరుగైన బ్రేకింగ్ సిస్టం కోసం ముందు మరియు వెనుక చక్రాలపైన డిస్క్ బ్రేక్లు అమర్చబడి ఉన్నాయి.
'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' సైకిల్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు మౌంటెన్ రైడింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండిల్బార్ ఇవ్వబడ్డాయి. కంపెనీ విడుదల చేసిన ఈ సైకిల్స్ కెటిఎమ్ యొక్క డీలర్షిప్ లలో లభ్యమవుతాయి. ఇది కెటిఎమ్ యొక్క అధీకృత సంస్థ.
'కెటిఎమ్ చికాగో డిస్క్ 271' విడుదల సమయంలో నైంటీ వన్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ 'సచిన్ చోప్రా' మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో సైకిల్ మార్కెట్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆధునిక కాలంలో కూడా ఎక్కువమంది ప్రజలు తమ ఆరోగ్యమైన శ్రద్ద చూపడంలో భాగంగానే సైకిల్స్ ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున మార్కెట్లో ఈ కొత్త సైకిల్ విడుదల చేయడం జరిగిందని తెలిపారు. అంతే కాకూండా ఈ సైకిల్ తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలిపారు.