పియోజియోట్‌కు ఎకరా రూపాయికే ఆఫర్ చేసిన ఏపి సర్కార్

One Rupee
అదేంటి ఎకరా భూమి కేవలం రూపాయి మాత్రమేనా.. అని ఆశ్చర్యపోకండి. అలాగే ఇదేదో గాలి వార్తని కొట్టిపారేయకండి. ఎందుకంటే ఇది నూటికి నూరుపాళ్లు నిజం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నెల్లూరు జిల్లాలలోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన తడ మడలంలో ఒక్కో ఎకరా భూమిని ఒక్కో రూపాయి చొప్పున వెయ్యి ఎకరాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాందడోయ్.. ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ "పిఎస్ఏ పియోజియోట్ సిట్రాన్‌"కు మాత్రమే.

ఈ ఫ్రెంచ్ కంపెనీ భారత్‌లో తమ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విషయం తెలుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు సదరు కంపెనీకు ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. మా రాష్ట్రంలో ప్లాంటు స్థాపిస్తే స్థలాన్ని చవకగా ఇవ్వడమే కాకుండా అదనపు రాయితీలు కూడా ఉంటాయని పేర్కొంది. ఈ ప్లాంటు స్థాపన కోసం పియోజియోట్‌ దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టనుందని అంచనా. కానీ కంపెనీ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.

కానీ.. కంపెనీ మాత్రం ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందుకు చాలానే కారణాలున్నాయి. తమిళనాడులో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఎన్నూర్‌లోని ఓడ రేవుల నుంచి కార్లను ఎగుమతి చేయవచ్చు. అంతేకాకుండా చెన్నై నగరం ఇప్పటికే ఆటోమోటివ్‌ హబ్‌ ఏర్పడి, విడిభాగాలను సరఫరా చేసే వారు కూడా అందుబాటులో ఉన్నారు. అయితే భూమిని చౌకగా ఇస్తే ఈ ఫ్రెంచ్‌ కంపెనీ మనవైపుకు మొగ్గవచ్చునని ఆంధ్రప్రదేశ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అలాగే గుజరాత్‌లోని నానో ప్లాంటుకు సమీపంలో ఉన్న భూములను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్షణమే పనులు ప్రారభించడానికి 150 ఎకరాల భూమి సరిపోతుందని కంపెనీ భావిస్తోంది. పియోజియోట్ గనుక భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న 700 ఫ్రెంచ్ కంపెనీలలో పియోజియోట్ తనదైన ప్రాముఖ్యతను చాటుకోనుంది. ఏదేమైనప్పటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆఫర్‌వైపు మొగ్గు చూపితే రూపాయికే ఎకరా భూమి ఏంటి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కునే ఆస్కారం ఉంది.

Most Read Articles

English summary
The fast growing Indian market has given red carpet welcome to many overseas players. The market is on top gear, to be ranked next to China in terms of volumes as the medium sized vehicles bring in more for the coffers. Sensing this growth, Peugeot has come out with its proposal to install a new plant in the Indian lands preferably in Gujarat.
Story first published: Thursday, March 3, 2011, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X