Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 6 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 8 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 10 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పియోజియోట్కు ఎకరా రూపాయికే ఆఫర్ చేసిన ఏపి సర్కార్
ఈ ఫ్రెంచ్ కంపెనీ భారత్లో తమ ప్లాంటు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ విషయం తెలుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు సదరు కంపెనీకు ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించింది. మా రాష్ట్రంలో ప్లాంటు స్థాపిస్తే స్థలాన్ని చవకగా ఇవ్వడమే కాకుండా అదనపు రాయితీలు కూడా ఉంటాయని పేర్కొంది. ఈ ప్లాంటు స్థాపన కోసం పియోజియోట్ దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టనుందని అంచనా. కానీ కంపెనీ మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.
కానీ.. కంపెనీ మాత్రం ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందుకు చాలానే కారణాలున్నాయి. తమిళనాడులో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ఎన్నూర్లోని ఓడ రేవుల నుంచి కార్లను ఎగుమతి చేయవచ్చు. అంతేకాకుండా చెన్నై నగరం ఇప్పటికే ఆటోమోటివ్ హబ్ ఏర్పడి, విడిభాగాలను సరఫరా చేసే వారు కూడా అందుబాటులో ఉన్నారు. అయితే భూమిని చౌకగా ఇస్తే ఈ ఫ్రెంచ్ కంపెనీ మనవైపుకు మొగ్గవచ్చునని ఆంధ్రప్రదేశ్ ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
అలాగే గుజరాత్లోని నానో ప్లాంటుకు సమీపంలో ఉన్న భూములను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తక్షణమే పనులు ప్రారభించడానికి 150 ఎకరాల భూమి సరిపోతుందని కంపెనీ భావిస్తోంది. పియోజియోట్ గనుక భారత్లో కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ఇప్పటికే భారత మార్కెట్లో ఉన్న 700 ఫ్రెంచ్ కంపెనీలలో పియోజియోట్ తనదైన ప్రాముఖ్యతను చాటుకోనుంది. ఏదేమైనప్పటి కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆఫర్వైపు మొగ్గు చూపితే రూపాయికే ఎకరా భూమి ఏంటి ప్రభుత్వం విమర్శలు ఎదుర్కునే ఆస్కారం ఉంది.