కరోనా ఎఫెక్ట్; హీరో నిఖిల్కు రెండు చలాన్లు జారీ చేసిన పోలీసులు
భారతదేశంలో కరోనా చాలా ఎక్కువగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు మరణించారు. అంతే కాకూండా ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఈ మహమ్మరి భారిన పడి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం దేశంలో తీవ్రంగా ప్రబలుతున్న కరోనా సెకండ్ వేవ్ నివారణకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా ఉన్నాయి. కరోనా నివారణలో భాగంగా ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలులో ఉంది. కావున ప్రజలు ఎవరూ బయటకు రాకూడదు అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావడానికి అనుమతించబడుతుంది.

కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా పోలీసులు వారిని కఠినంగా శిక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో కరోనా అమలులో ఉన్న సమయంలో ప్రముఖ తెలుగు హీరో 'నిఖిల్' రేంజ్ రోవర్ కారు బయటకు వచ్చినట్లు తెలిసింది.

నివేదికల ప్రకారం హైదరాబాద్లో లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించిన సినీనటుడు హీరో నిఖిల్కు చెందిన రేంజ్ రోవర్ కారుకు కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా కారు కనిపించింది. దీంతో వాహనం నడుపుతున్న వ్యక్తిని వివరాలు కోరగా సినీ నటుడు నిఖిల్కు చెందిన కారుగా తెలిసింది.

హీరో నిఖిల్ మొదట హ్యాపీ డేస్ సినిమాలో తెలుగు సినిమా రంగంలో అడుగు పెట్టి తరువాత కాలంలో స్వామి రారా, కార్తికేయ మొదలైన సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం నిఖిల్ టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మరియు చందూ మొండేటి డైరెక్షన్ లో వస్తున్న కార్తికేయ 2 సినిమాలోనూ, అలాగే సుకుమార్ నిర్మిస్తున్న '18 పేజీస్' సినిమాలోనూ నటిస్తున్నట్లు తెలిసింది.

హీరో నిఖిల్ ఏ మధ్యనే తన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే అతని భార్య 'పల్లవి' డాక్టర్ కావడంతో రోగులకు వైద్యపరమైన సలహాలు ఇస్తూ, వాలంటీర్గా పనిచేస్తున్న విషయం అందరికి తెలిసిందే.

దేశంలో ప్రతి రోజు ఒక లక్షకు పైగా కొత్త కరోనా కేసులు వస్తుండటంతో, ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలతో లాక్ డౌన్ విధించారు. ఇవన్నీ పోలీసుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అనవరసం బయటకు వచ్చిన వారు ఎంతటి వారైనా వారికీ శిక్ష తప్పడం లేదు. ఇటీవల లాక్ డౌన్ లో బయటకు వచ్చిన ఒక రాజకీయ నాయకుని ఏకంగా 11,000 రూపాయలు జరిమానా విధించినట్లు తెలిసింది.
Source: Sakshi


Click it and Unblock the Notifications








