ఇండియన్ ఎయిర్ ట్రావెల్ గురించి ఆశ్చర్యగొలిపే నిజాలు
ఈ దశాబ్దం కాలంలో విమానయాన సేవలు విరివిగా అందుబాటులోకి రావడంతో, ఎయిర్ ట్రావెల్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కానీ, ఎన్నో దశాబ్దాల క్రితమే భారత్లో విమానయాన సేవలు పరిచయం అయ్యాయి.
ఈ రోజుల్లో విమాన ప్రయాణం చాలా మంది లైఫ్లో సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లాలంటే విమాన ప్రయాణం మీద ఆధారపడేవారు. ఇప్పుడు చిన్న చిన్న నగారల మద్య కూడా విమానాన్నే ఎంచుకుంటున్నారు.
Recommended Video


ఈ దశాబ్ద కాలంలో విమానయాన సేవలు విరివిగా అందుబాటులోకి రావడంతో ఎయిర్ ట్రావెల్ చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కానీ, ఎన్నో దశాబ్దాల క్రితమే భారత్లో విమానయాన సేవలు పరిచయం అయ్యాయి. సుధీర్ఘ చరిత్ర గల ఇండియన్ ఎయిర్ ట్రావెల్ గురించి 14 ఆశ్చర్యకరమైని నిజాలను డ్రైవ్స్పార్క్ తెలుగు మీ కోసం తీసుకొచ్చింది.

14
దేశీయంగా మాత్రమే ప్రయాణించే విమనాలు ఒక్కోసారి అంతర్జాతీయ విమానాశ్రయాలలో కూడా ల్యాండ్ అవుతాయి.

13
ఇండియాలో ఒక విమానం ఆలస్యమైతే, అదే విమానం కోసం వేచి ఉండటం కంటే తరువాత వచ్చే విమానాన్ని వేగంగా క్యాచ్ చేయవచ్చు.

12
ఎయిర్ హోస్టెస్ అంటే అందమైన అమ్మాయిలు గుర్తొస్తారు. కానీ, ఇండియాలో ఉన్న ఒక ఎయిర్ లైన్స్లో బాగా వయసైపోయిన మహిళలు ఎయిర్ హోస్టెస్గా ఉంటారు(ఎయిర్ ఇండియా).

11
ఎయిర్ ఇండియా నిజానికి 1932లో ఏర్పడిన టాటా ఎయిర్ లైన్స్. అయితే, రెండవ ప్రపంచ యుద్ద కాలంలో టాటా ఎయిర్లైన్స్లో అధిక వాటా భారత ప్రభుత్వం సొంతం కావడంతో ఎయిర్ ఇండియాగా రూపాంతరం చెందింది.

10
డొమిస్టిక్ విమానాలలో ప్రయాణికులకు మద్యం సరఫరా చేయవు. ఒక వేళ విదేశాలకు వెళ్లే ఆ విమానం చివరి స్టాప్ ఇండియాలో ఉంటే మాత్రం ప్రయాణికుల కోరిక మేరకు మద్యాన్ని సరఫరా చేస్తాయి.

09
ఇండియాలో మొత్తం 14 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉంటే, అందులో 3 కేరళలోనే ఉన్నాయి. అవి, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం, కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం.
Trending On DriveSpark Telugu:

08
ముంబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ పేరుతో నామకరణం చేయడానికి ముందు "డుం డుం ఎయిర్పోర్ట్" అని పిలిచేవారు.
Picture credit: SkyscraperCity

07
ఢిల్లీలోని ఇంధిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్లోకెల్లా అత్యంత రద్దీతో(Busiest) కూడిన విమానాశ్రయం.
Picture credit: Ramesh NG / Wiki Commons

06
1992లో ప్రారంభమైన ఎయిర్ ట్యాక్సీ తరువాత జెట్ లైట్కు పేరుమార్చుకుంది. ఇప్పుడు, జెట్ ఎయిర్వేస్ పేరుతో సర్వీసులు అందిస్తోంది.
Picture credit: Jet Airways

05
భారత్లో, ప్రయాణికులు విమానం ల్యాండ్ అయిన వెంటనే చాలా ఆతృతగా వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తారు. విమానంలో వెళ్లాల్సిన సందర్బంలో మాత్రం ఎంతసేపయినా క్యూ లైన్లో ఉంటారు. అయితే, ఇదే ప్రయాణికులు విదేశీ ఎయిర్పోర్టుల్లో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు.

04
తల్లి ఇందిరా గాంధీ మరణానంతరం ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ అయిన అతి పిన్న వయస్సులో భారత ప్రధానమంత్రి అయిన వ్యక్తిగా అందరికీ తెలిసిందే. అయితే, రాజీవ్ గాంధీ రాజకీయవేత్తగానే కాకుండా ఇండియన్ ఎయిర్లైన్స్లో ప్రొఫెషనల్ పైలట్గా కూడ గుర్తింపు పొందాడు.
Picture credit: Santosh Kumar Shukla / Wiki Commons

03
స్వాతంత్రం వచ్చిన తరువాత జాతీయం చేయడానికి ముందు ముంబాయ్లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బ్రిటీష్ అధికారులు పెట్టిన శాంటా క్రుజ్ అనే పేరు వాడుకలో ఉండేది.
Picture credit: shyam / Wiki Commons

02
ఇండియాలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లలో తక్కువ పొడవున్న రన్వే గల విమానాశ్రయం తమిళనాడులోని తిరుచిరాపల్లి(త్రిచి) అంతర్జాతీయ విమానశ్రయం. త్రిచి ఎయిర్పోర్ట్ లోని రన్వే పొడవు కేవలం 816 అడుగులు మాత్రమే.

01
దక్షిణ భారతదేశంలో ఉన్న సగం ఎయిర్పోర్టులు 500కిలోమీటర్ల దూరంలోపే ఉన్నాయి. ఉదాహరణకు కేరళలోని కొచ్చి, తిరువనంతపురం, కాలికట్ మరియు నిర్మాణ దశలో ఉన్న కన్నూర్ విమానాశ్రయాల మద్య దూరం 500కిలోమీటర్లు మాత్రమే.
Picture credit: Ramesh NG / Wiki Commons
Trending DriveSpark Telugu YouTube Videos


Click it and Unblock the Notifications








