ప్రపంచ ఉగ్రవాద దేశాలైన చైనా, పాకిస్తాన్ల మీద గురిపెట్టిన అగ్ని-IV
ఒడిస్సా తీరంలో భారత్ న్యూక్లియర్ సామర్థ్యమున్న అగ్ని-IV ఖండాతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇది భారత్ శత్రు దేశాలకు పెద్ద ప్రమాదమని చైనా మీడియా ఒకటి అభిప్రాయాన్ని వెల్లడించింది.
ఒడిస్సా తీరంలో భారత్ న్యూక్లియర్ సామర్థ్యమున్న అగ్ని-IV ఖండాతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అయితే ఇది భారత్ శత్రు దేశాలకు పెద్ద ప్రమాదమని చైనా మీడియా ఒకటి అభిప్రాయాన్ని వెల్లడించింది. అగ్ని-IV గురించి ఆసక్తికరమైన విషయాలు....

అగ్ని-IV గురించి ప్రపంచ మరియు భారత్ శత్రు దేశాలు భయపడాల్సిన అవసరం ఏమిటి...? మరియు అగ్ని-IV యొక్క శక్తిసామర్థ్యాల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...

అగ్ని-IV మిస్సైల్ను ప్రత్యేకించి పలానా దేశం మీద దృష్టి సారించి నిర్మించినది కాదు, ఇది భారత దేశం యొక్క వ్యూహాత్మక శక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకునే భాగంలో రూపొందించబడింది. ప్రత్యక్షంగా సానుకూల ధోరణిలో ఉన్నప్పటికీ పరోక్షంగా భారత్ అంటే తీవ్ర అసంతృప్తితో ఉన్న దేశాలు దీనిని అశుభంగా పరిగణించుకుంటున్నాయి.

చైనాకు చెందిన ఒక మీడియా ఈ అగ్ని-IV ఖండాంతర బాలిస్టిక్ అణు క్షిపణి చివరి దశ ప్రయోగం విజయవంతం అయిన తరువాత ప్రపంచలోని భారత్ దేశాలు భయపడాల్సిన సమయం వచ్చిందని తెలిపినట్ల తెలిసింది.

పూర్తి స్వదేశీయ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఈ ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణిలో రెండు దశలలో ఆయుధాలను ప్రయోగించే సామర్థ్యం కలదు.

20 మీటర్లు పొడవు 17 టన్నుల బరువున్న అగ్ని-IV క్షిపణిలో ఆన్ బోర్డ్ కంప్యూటర్ మరియు నిర్మాణాత్మక పంపిణీ వంటి వ్యవస్థలను ఇముడింపజేయడం జరిగింది.

గగన తలంలో విమానాలు మరియు ఎగిరే వస్తువుల ద్వారా కలిగే ఆటంకాల నుండి తప్పించుకుని తన మార్గాన్ని తానే నియంత్రించుకునే పరిజ్ఞానాన్ని కూడా ఇందులో పరిచయం చేసారు.

అగ్ని-I, అగ్ని-II, అగ్ని-III మరియు పృథ్వి క్షిపణిలు ఇప్పటికే భారత సాయుధ దళాలలో సేవలందిస్తున్నాయి. ఇవి సుమారుగా 3,000 కిలోమీటర్ల పరిధిని చేరుకోవడానికి సమర్థవంతమైన నిరోధక సామర్థ్యాన్ని అందించడం జరిగింది.

2014 నుండి వివిధ దశలలో పరీక్షించబడిన దీనిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDoO) అభివృద్ది చేయగా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఈ మిస్సైళ్లను ఉత్పత్తి చేస్తోంది.

అణు సామర్థ్యం ఉన్న అగ్ని-IV క్షిపణిలో 2-స్టేజి సాలిడ్ ప్రొపెల్లంట్ ఇంజన్ కలిగిన ఇది ఒక టన్ను బరువున్న వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. ఫరిది పెరిగేకొద్దీ విధ్వంసక ఖచ్చితత్వాన్ని కూడా పెంచుకునే విధంగా దీనిని DRDO బృందం అభివృద్ది చేసింది.

ప్రస్తుతం దీని రాడార్ సంకేతాలను విశేషంగా తగ్గించి, ప్రతిదాడులను తట్టుకునేలా అభివృద్ది చేస్తున్నారు, అంతే కాకుండా బాలిస్టిక్ క్షిపణి నిరోధక వ్యవస్థలను తలదన్నేలా అగ్ని-IV క్షిపణిని మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భారత్ అగ్ని-V అణు క్షిపణి పరీక్షలపై ప్రపంచ దేశాల్లో నెలకొన్న సందిగ్దత:
అగ్ని-V అణు క్షిపణిని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ తరుణంలో చైనాతో పాటు భారత్ శత్రు దేశాలు భారత్ను చూసి మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది.

బాబర్ 3 అణు క్షిపణి పరీక్ష బూటకమని తేల్చిన సాంకేతిక విశ్లేషకులు...
సోమవారం (09/01/2017) నాడు హిందూ మహాసముద్రం నుండి జలాంతర్గామి సాయంతో ప్రయోగించిన బాబర్-3 అణుక్షిపణి అంతా బూటకమే అని నిపుణులు తేల్చితెబుతున్నారు.


Click it and Unblock the Notifications








