ఏప్రిల్ 20 తర్వాత బేసి - సరి విధానం, ఎలా ఉంటుందో తెలుసా..?
భారతదేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కరోనా నివారణకు లాక్ డౌన్ రెండవ దశను అమలు చేస్తూ ప్రకటన జరీ చేశారు. దీని ప్రకారం లాక్ డౌన్ భారతదేశంలో 2020 మే 03 వరకు పొడిగించారు.

దేశ వ్యాప్తంగా కరోనా ఎక్కువగా ఉన్నప్పటికీ చాల ప్రణతాలలో ఒక్క కేసు కూడా నమోదు కానీ ప్రణతలు కూడా ఉన్నాయి. కావున ఈ ప్రాంతాలలో లాక్ డౌన్ ఎట్టి వేసే దిశగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాష్టంలో కూడా ఏప్రిల్ 20 తరువాత కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాలలో కూడా కొన్ని షరతులు అమలులో ఉంటాయి.

కేరళలోని కొన్ని జిల్లాల్లో, ఏప్రిల్ 20 తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తామని ఇటీవల కేరళ ముఖ్యమంత్రి ప్రకటించారు. బేసి-సరి వ్యవస్థ అమలుకు ముందు షరతులు కూడా విధించనున్నారు. ఈ విధానంలో మహిళలకు మినహాయింపు ఉండే అవకాశం ఉంది.

కరోనావైరస్ కేసులు లేని ప్రాంతాలలో మరియు లోతట్టు జిల్లాల్లో మాత్రమే బేసి - సరి విధానం అమలు చేయబడుతుంది. ఏఈ విధానం ప్రకారం బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు బేసి రోజులలో మరియు సరి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు సరి రోజులలో తిరగటానికి అవకాశం కల్పించబడుతుంది.

కరోనా కేసుల సంఖ్య ఆధారంగా జిల్లాలను నాలుగు మండలాలుగా విభజించాల్సి ఉన్నందున, బేసి-సరి అనే కొత్త వ్యవస్థను ఏ జిల్లాల్లో అమలు చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. దీని కోసం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి.

కరోనా వైరస్ బారిన పడిన జిల్లాలు ఏప్రిల్ 20 వరకు మాత్రమే కాకుండా ఖచ్చితంగా మే 3 వరకు పాటించాలి. కరోనా వైరస్ లేని జిల్లాలకు రాయితీ ఇవ్వబడుతుంది. కరోనా లేని జిల్లాలకు కొన్ని షరతులతో ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది.

ఇలాంటి వ్యవస్థను కొద్ది రోజుల క్రితం తమిళనాడులో ప్రకటించారు. బేసి లాంటి విధానానికి సమానమైన కలర్ కోడింగ్ పథకాన్ని తమిళనాడులో అమలు చేశారు.

ఈ ప్రాజెక్టులో వాహనాలు పెయింట్ చేయబడతాయి. ఆ రంగు యొక్క వాహనం సంబంధిత రోజున మాత్రమే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ఈ నిబంధన పాటించకపోతే వాహనాలు జప్తు చేయబడతాయి. అంతే కాకుండా వీరికి కఠినమైన చర్యలు కూడా వర్తిస్తాయి.


Click it and Unblock the Notifications








