Just In
- 14 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 14 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 15 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 17 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
- Movies యాంకర్ దీపికా పిల్లి బెడ్ వీడియో వైరల్: కళ్లు చెదిరేలా ప్యాంటు లేకుండా!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చైనా నుండి ఎనిమిది సబ్మెరైన్లను కొంటున్న పాక్; ముప్పులో భారత్...!!
భారత దేశం మరియు పాకిస్తాన్ల మధ్య ఉన్న సరిహద్దులో వాతావరణ అల్లకల్లోలంగా ఉంది. భారత జవాన్లు పాక్ మూకలకు ధీటైన సమాధానం ఇస్తుంటే, చైనా పాక్ ఉగ్రవాదులకు ఉగ్గుపాలు పోసి మరీ పెంచుతోంది.
పాకిస్తాన్కు
సహకరిస్తూ
చైనా
పాక్కు
సబ్మెరైన్లను
అందివ్వడానికి
సుముఖత
చూపుతోంది.
వచ్చే
దశాబ్దానికి
పాకిస్తాన్కు
ఎనిమిది
యుద్ద
జలాంతర్గామిలను
చైనా
అందివ్వనుంది.
2028 నాటికి సుమారుగా ఎనిమిది యుద్ద డీజల్ జలాంతర్గాములను సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇందుకు సంభందించి పాకిస్తాన్తో సుమారుగా 5 మిలియన్ డాలర్ల అస్థిర ఒప్పందం కుదుర్చుకుంది.
పాకిస్తాన్ మీడియా ప్రకారం, పాకిస్తాన్ తరువాత తరం సబ్మెరైన్ మరియు సీనియర్ నేవీ అధికారులు గత ఆగష్టు 26 న నిర్వహించిన నేషనల్ అసెంబ్లీ స్టాండింగ్ కమీటి సదస్సులో ఈ ఒప్పందం గురించి వివరించినట్లు తెలిసింది.
గత ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ నావికా దళ సీనియర్ అధికారి మాట్లాడుతూ, కరాచీ షిప్ యార్డ్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ (KSEW) ప్రదేశానికి చైనాతో ఒప్పందం చేసుకున్న ఎనిమిదింటిలో నాలుగు జలాంతర్గాములను చేర్చనున్నట్లు తెలిపాడు.
ఈ నాలుగు సబ్మెరైన్లలో ఎయిర్-ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) వ్యవస్థలను అందిస్తున్నారు.
పాకిస్తాన్ను అన్ని విధాలా ఆదుకునేందుకు చైనా పాక్ చేసుకున్న ఒప్పందానికి కావాల్సిన మొత్తానికి బుణ సదుపాయం కల్పించనుంది. మరియు తక్కవ వడ్డీ రేటును కూడా అందిస్తోంది.
చైనాలోని చైనా షిప్ బిల్డింగ్ ట్రేడింగ్ కంపెనీ పాక్కు కావాల్సిన జలాంతర్గాములను నిర్మించనుంది.
అయితే పాక్కు ఏ విధమైన జలాంతర్గాములను అందిస్తున్నారు అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది.
సమచార వర్గాల ప్రకారం, తేలికగా ఎగుమతి చేయగలగే వీలున్న పీపుల్ లిబేరియన్ ఆర్మీ న్యావీ లోని 039 రకము మరియు 041 రకము యువాన్ తరగతికి చెందిన కన్వెన్షనల్ టైప్ అట్టాక్ సబ్మెరైన్లను పాక్ కొనుగోలు చేయనుంది.
ముందుగా 2023 నాటికి కరాచి షిప్ యార్డ్కు మొదటి నాలుగు సబ్మెరైన్లను డెలివరీ ఇవ్వనుంది.
మొదటి నాలుగు జలాంతర్గామిలను డెలివరీ ఇచ్చిన ఐదు సంవత్సరాలకు అంటే 2028 నాటికి మిగతా నాలుగు జలాంతర్గాములను డెలివరీ ఇవ్వనుంది.
ఈ జలాంతర్గాముల ద్వారా పాకిస్తాన్కు ఉన్న సముద్రం మార్గం ద్వారా అణు శక్తి దాడులకు తెగబడేందుకు సిద్దమవుతున్నట్లు తెలసింది.
చైనా మరియు పాకిస్తాన్ల స్నేహం రోజు రోజుకీ బలపడుతోంది. పాకిస్తాన్కు కావాల్సిన ఆయుధాలను, యుద్ద సామాగ్రిని మరియు అత్యంత శక్తివంతమైన యుద్ద ట్యాంకులను సరఫరా చేస్తోంది.
యుద్ద విమానాలను మరియు జె-17 థండర్ వార్ ప్లేన్లను ఇప్పటికే చైనా పాక్కు అందిస్తోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఉన్న జలాంతర్గాముల వివరాలు
- అగోస్టా70 - 2
- అగోస్టా90బి - 3
- ఎమ్జి110 మినియేచర్ సబ్మెరైన్లు (SSI) - 3
- లగ్జరీ నౌకల్లో మానవాళికి తెలియని భయంకర రహస్యాలు
- పాక్ ఉగ్ర మూకల అంతం కోసమేనా...?
- సంచలనాలు సృష్టించిన టూ వీలర్లు...!!