Just In
- 4 min ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 1 hr ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 2 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 3 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
క్రిమినల్స్ కోసమే బ్లాక్ ఫిల్ముల బ్యాన్, డీసెంట్ వ్యక్తులకు కాదు: మంత్రి
అధికమవుతున్న నేరాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, వాహనాలకు నల్లటి అద్దాలు ఉపయోగించడాన్ని నిషేధిస్తూ దేశపు అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొందరు బడా బాబులు మాత్రం ఈ నిబంధను ఉల్లంఘింటి విచ్చలవిడిగా రోడ్లపై తిరిగేస్తున్నారు. ఈ విషయంలో తాజాగా ఘజియాబాద్లో ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. వాహనాలకు నల్లటి అద్దాలను ఉపయోగించడం బ్యాన్ చేసింది 'క్రిమినల్స్'కి మాత్రమేనని 'డీసెంట్ వ్యక్తుల'కు కాదని ఓ యూపి మంత్రి వ్యాఖ్యానించారు.
ఘజియాబాద్లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన యూపి క్యాబినెట్ మినిస్టర్, సమాజ్వాదీ పార్టీ నాయకుడు రామ్ అస్రేయ్ కుష్వాహా వాహనానికి నల్లటి అద్దాలు ఉండటాన్ని చూసిన మీడియా ప్రతినిధులు, అదే విషయాన్ని సదరు నేత ముందు ప్రస్తావించగా, అందుకు ఆయన సమాధామిస్తూ.. నేరగాళ్ల కోసమే బ్లాక్ ఫిల్ముల వాడకాన్ని నిషేధించారని, డీసెంట్ వ్యక్తులు మరియు సమాజానికి ఎలాంటి హాని కలిగించని వారు ఇలాంటి వాహనాలను ఉపయోగించుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. రాజకీయ నాయకులు భద్రత దృష్ట్యా, వాహనాలకు నల్లటి అద్దాలను ఉపయోగించడం సురక్షితమని ఆయన అన్నారు.
'మోటార్ వాహన చట్టం ప్రకారం, కారు ఫ్రంట్ విండ్స్క్రీన్ (ముందు వైపు అద్దం), రియర్ విండ్స్క్రీన్ (వెనుక వైపు అద్దం) లపై 70 శాతం విజువల్ లైట్ ట్రాన్స్మిషన్ (విఎల్టి)ను, కారుకు పక్కల ఉండే అద్దాలకు (కారు డోర్లకు అమర్చిన అద్దాలు) 50 విఎల్టిని కలిగి ఉండాలి'. సాధారణంగా వాహనాలను తయారు చేసే కంపెనీలు ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకొనే అద్దాలను ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ గ్లాసెస్లపై ఏ రకమైన సన్ ఫిల్ములను ఉపయోగించిన అది చట్ట వ్యతిరేకమే అవుతుంది.