200 రూపాయల ట్రాఫిక్ ఫైన్ రద్దు కోసం రూ. 10,000 ఖర్చు చేసిన వ్యాపారవేత్త
భారతదేశంలో రోడ్డుప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వాహనదారులపై కేంద్ర మరియు రాష్ట్ర కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నారు. కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరిస్తూ ట్రాఫిక్ చలాన్లు కడతారు, అయితే కొంతమంది తమ తప్పులేకపోతే ఎంత దూరమైనా వెళ్ళడానికి వెనుకాడరు.

ఇదే రీతిలో పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త రూ. 200 ట్రాఫిక్ జరిమానా రద్దు చేయించుకోవడం కోసం పోరాడుతున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం యితడు నో పార్కింగ్ లో పార్క్ చేయడం వల్ల అతనికి పోలీసులు 200 రూపాయల జరిమానా విధించినట్లు తెలిసింది.

జనవరి నెలలో, బినాయ్ గోపాలన్ పింప్రి-చిన్చ్ వాడ్ ట్రాఫిక్ పోలీసుల నుండి రూ. 200 చలాన్ అందుకున్నాడు. పార్కింగ్ గుర్తుపై శ్రద్ధ చూపకుండా వాహనాన్ని పార్కింగ్ చేసినందుకు చాలా మందికి జరిమానా విధించబడింది. అక్కడ అందరూ జరిమానా చెల్లించారు.

కానీ బినాయ్ గోపాలన్ రూ. 200 రూపాయల ట్రాఫిక్ జరిమానా చెల్లించడానికి నిరాకరించాడు. కేవలం 200 రూపాయల ట్రాఫిక్ జరిమానా చెల్లించినట్లైతే, ఆ కేసు అక్కడితో ముగుస్తుంది. కానీ జరిమానాలు చెల్లించే బదులు ట్రాఫిక్ పోలీసు కార్యాలయాన్ని సందర్శించి పలువురు ట్రాఫిక్ పోలీసులతో సమావేశమై పలు పిటిషన్లను అధికారులకు సమర్పించారు.

అంతే కాకుండా అతను ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పై కేసు పెట్టాడు మరియు అనేక విచారణల తరువాత, వారు చేసిన తప్పులను అంగీకరించి, వారిపై జారీ చేసిన ఆన్లైన్ చలాన్ను ఉపసంహరించుకోవాలని ఆయన అధికారులను కోరారు.

45 ఏళ్ల బినాయ్ గోపాలన్ పూణేలోని ఖరాల్వాడి రోడ్లోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చినప్పుడు, తన బైక్ను బ్యాంకు వెలుపల అధికారిక పార్కింగ్ స్థలంలో ఉంచాడు.

పార్కింగ్ స్థలం యొక్క కుడి వైపున ఉన్న పార్కింగ్ గుర్తు లేదు అని బినాయ్ గమనించి, ఎవరో తీసివేసి ఉంటారని అక్కడ పార్కింగ్ చేసాడు. అయితే తర్వాత అతనికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఇందులో అతని తప్పు లేదని పోలీసులకు అర్థమయ్యేలా చెప్పడానికి బినాయ్ ప్రయత్నించాడు.

కానీ, పోలీసులు దీనిని నమ్మలేదు. ఈ విషయాన్ని ఆయన ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంబంధించిన అన్ని ఆధారాలు సమర్పించారు. అధికారులు మొదట అతని వాదనను అంగీకరించారు, కానీ రికార్డుల ప్రకారం, ఆ ప్రదేశం అధికారిక పార్కింగ్ స్థలం అని చెప్పారు.

మొదట పోలీసులు చలాన్ రద్దు చేయడానికి నిరాకరించారు. తొలగించిన గుర్తు తమను గందరగోళానికి గురిచేసినట్లు అంగీకరించడంతో పోలీసులు తరువాత రూ. 200 జరిమానాను రద్దు చేశారు.

చివరకు బినాయ్ ట్రాఫిక్ చలాన్ రద్దుచేశారు, కానీ దీని కోసం అతడు రెండు నెలలుగా పోలీసు శాఖ కార్యాలయాలలో తిరుగుతున్నాడు. పోలీస్ కార్యాలయం చుట్టూ తిరగడానికి అతనికి దాదాపు 10,000 రూపాయలు ఖర్చు చేశాడు. అతడికి 200 రూపాయలు చెల్లించడం పెద్ద విషయం కాదు, కానీ అతను చేయని తప్పుకు జరిమానా చెల్లించటానికి అతను ఇష్టపడలేదు. అయితే అతడు న్యాయం కోసం రూ .10,000 ఖర్చు చేయడం నిజంగా బాధాకరం.


Click it and Unblock the Notifications








