యుఎమ్ మోటర్ సైకిల్స్ నుండి కొత్త క్రూజర్ బైక్
యు ఎమ్ మోటర్ సైకిల్స్ 2014 ఆటో ఎక్సపోలో తన ద్విచక్ర వాహనాలను ప్రదర్శించిది. ప్రస్తుతం యు.ఎమ్ మోటర్ సైకిల్స్ ఇండియాలో పతనమైన తమ మార్కెట్ను పెంచుకునేందుకు లోహియా ఆటోతో చేతులు కలుపుతోంది. యు.ఎమ్ మోటర్ సైకిల్స్ 2016 లో జరగనున్న ఆటో ఎక్స్ పోలో తన క్రూజర్ బైక్ని విడుదల చేయనున్నది.
యు.స్ ఆధారంతో తయారు కానున్న మొట్ట మొదటి ద్విచక్ర వాహనం క్రూజర్ మోటర్ సైకిల్. దేశీయంగా తయారైన విడిభాగాలతో దీనిని తయారుచేసి దేశ యువతకు ఆకర్శణీయమైన ధరకు అందించాలని కంపెనీ నిర్ణయించింది.

లోహియా ఆటో మరియు యు.ఎమ్ మోటార్ సైకిల్స్ భాగస్వామ్యంతో తమ తయారి యూనిట్ ను ఉత్తరాఖండ్ లో నెలకొల్పనున్నారు. ఈ ప్లాంటులో తమ ప్రాథమిక ఉత్పత్తి 1,00,000 బైక్లను లక్ష్యంగా పెట్టుకున్నారు.
యు.ఎమ్ మోటర్ సైకిల్స్ తమ క్రూజర్ మోడల్ నందు 350-500 సీసీ గల సింగల్ సిలిండర్ బైక్లను అందిచనున్నారు. భారతీయ మార్కెట్లోకి వీరి సంయుక్త భాగస్వామ్వం తమ తయారి రంగం మీద 100 కోట్ల రుపాయలను పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా యు.ఎమ్ మోటర్ సైకిల్స్ దేశ వ్యాప్తంగా గల మెట్రో నగరాలలో డీలర్ షిప్ మరియు వీటికి సర్వీసింగ్ అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు నెమ్మదిగా వీటిని మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నారు.
అయితే వీటికి సంభందిచిన ధర, మరియు ఇతర స్పెసిఫికేషన్ల కోసం 2016లో జరగనున్న ఆటో ఎక్స్-పో వరకు వేచి చూడాల్సిందే............
వీటిని కూడా చదవండి


Click it and Unblock the Notifications








