Just In
- 43 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
బాలికల విద్య కోసం కె2కె సాహస యాత్ర
బాలికల విద్యా ఉన్నతి కోసం "వీల్స్ ఆఫ్ చేంజ్" చొరవతో ఇండియన్ మోటార్ సైకిల్ కన్యాకుమారి - కాశ్మీర్(కె2కె) రైడ్ను బెంగళూరు జెండా ఊపి ప్రారంభించింది.
బాలికల విద్యా ఉన్నతి కోసం "వీల్స్ ఆఫ్ చేంజ్" చొరవతో ఇండియన్ మోటార్ సైకిల్ కన్యాకుమారి - కాశ్మీర్(కె2కె) రైడ్ను బెంగళూరు జెండా ఊపి ప్రారంభించింది.
ముగ్గురు ఇండియన్ రోడ్ మాస్టర్ ఓనర్లు 12 నగరాల మీదుగా ప్రయాణించి ఆరు స్కూళ్లు సందర్శించనున్నారు. విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ మరియు బాలికల విద్యకు నిధులను సేకరించనున్నారు. కె2కె రైడ్లో అనురాగ్ శ్రీవాస్తవ, నిలాద్రి సాహా మరియు బెర్నార్డ్ లాజర్ పాల్గొంటున్నారు.
బాలికలకు ప్రాథమిక మరియు హై స్కూల్ విద్యనందించేందుకు రైడింగ్ అంటే విపరీతమైన మక్కువ ఉన్న ముగ్గురు ఇండియన్ మోటార్ సైకిల్ కస్టమర్ల నుండి ఈ కన్యాకుమారి - కాశ్మీర్ (కె2కె) రైడ్ ప్రాణం పోసుకుంది.
Recommended Video
అంతే కాకుండా బెంగళూరులోని కోడి హళ్లి ప్రాంతంలో ఉన్న విద్యారణ్యలో గల "రెయిన్ బో హో" వీల్స్ ఆఫ్ చేంజ్ అనే ఫౌండేషన్ వారు ఇండియన్ మోటార్ సైకిల్ కె2కె రైడ్ కోసం ముందుకొచ్చారు.
ఈ ఫౌండేషన్ సుమారుగా 76 మంది ఆడ పిల్లను చేరదీసి, పునరావాసం కల్పించి విద్య, ఆహారం, ఆవాసం, మరియు దుస్తులను ఉచితంగా అందిస్తోంది. ఇలాంటి బాలికల విద్య కోసం ఇండియన్ మోటార్ సైకిల్ ప్రారంభించిన కె2కె రైడ్ బెంగళూరు నుండి తమిళనాడు చేరుకొని, తమిళనాడులోని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగనుంది.
కె2కె రైడ్లో భాగంగా ముగ్గురు రైడర్లు దేశవ్యాప్తంగా ఉన్న 12 ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, కన్యాకుమారి, కోల్హాపూర్, ముంబాయ్, అహ్మదాబాద్, ఉదయ్పూర్, జోధ్పూర్, ఢిల్లీ, జలందర్, అమృత్సర్, మరియు రణబీర్ సింగ్ పుర మీదుగాకాశ్మీరుని చేరుకోనున్నారు.
పొలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా హెడ్ మరియు మేనేజింగ్ డైరక్టర్ పంకజ్ దుబే మాట్లాడుతూ,"నీలాద్రి సాహా, అనురాగ్ శ్రీవాస్తవ మరియు బెర్నార్డ్ లజార్ ముగ్గురు రైడర్లు కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించి, బాలికల విద్య గురించి చైతన్యం తీసుకొచ్చేందుకు కె2కె రైడ్ ద్వారా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు."
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వీల్స్ ఆఫ్ చేంజ్ చొరవతో దేశవ్యాప్తంగా ఆడ పిల్లల విద్యాభివృద్ది కోసం ఇండియన్ మోటార్ సైకిల్స్ పాటుబడుతోంది. కె2కె రైడ్లో పొల్గొన్న ముగ్గురు రైడర్లు దేశవ్యాప్తంగా ఉన్న ప్రదాన నగరాలను చేరుకుని చిన్న ఆడ పిల్లల విద్య కోసం నిధులను సేకరించనున్నారు మరియు బాలికలకు ఎడ్యుకేషన్ కిట్లను పంపిణీ చేయనున్నారు.