Just In
- 13 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- News పిఠాపురంలో ముద్రగడకు మూడో స్ధానం..! అప్పట్లో వంగా గీత చేతిలో ఓటమి..!
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హోండా మోటార్సైకిల్స్ మరియు స్కూటర్స్పై సైబర్ అటాక్
సైబర్ నేరగాళ్లు ఆటోమొబైల్ కంపెనీలను కూడా వదలడం లేదు. తాజాగా జపనీస్ మోటార్సైకిల్ బ్రాండ్ హోండా మోటార్ కంపెనీపై సైబర్ అటాక్ జరిగింది. ఈ సైబర్ అటాక్ కారణంగా హోండా సర్వెర్లలో వైరస్ చొరబడి, ప్రొడక్షన్ ప్రక్రియలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
జపాన్లోని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఫ్యాక్టరీపై జరిగిన ఈ సైబర్ అటాక్ ప్రభావం, ఈ సంస్థకు చెందిన వివిధ దేశాల్లోని 11 ఇతర ప్లాంట్లపై కూడా పడింది. అందులో భారతదేశానికి చెందిన ప్లాంట్ కూడా ఉంది. అమెరికాలో మొత్తం ఐదు ప్లాంట్లలో ద్విచక్ర మరియు కార్ల ఉత్పత్తి కేంద్రాలు కూడా ఈ సైబర్ డాడికి గురయ్యాయి.
హోండా గ్లోబల్ నెట్వర్క్ అవుటేజ్ కారణంగా భారత్లోని హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) కూడా ఈ సైబర్ అటాక్కు గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా కంపెనీ ప్లాంటులో ఉత్పత్తి కార్యకలాపాలు స్వల్ప అంతరాయం ఏర్పడిందని, అయితే వెంటనే కంపెనీ తేరుకొని ఈ సమస్యను పరిష్కరించిందని తెలుస్తోంది.
MOST READ: మ్యాక్సీ స్కూటర్ను ఆవిష్కరించిన హోండా
అయితే, భారత్లో హోండాకు చెందిన కార్ల విభాగం అయిన హోండా కార్స్ ఇండియాలో మాత్రం ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం కలగలేదని కంపెనీ పేర్కొంది.
ఈ విషయంపై హోండా అధికార ప్రతినిధి పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా హోండాకి సంబంధించిన నెట్వర్క్లో స్వల్ప అంతరాయం సంభవించిందని, దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ సాగుతోందని, రికవరీ ప్రాసెస్ కూడా చాలా వేగంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ నెట్వర్క్ అవుటేజ్ వలన తమ డీలర్షిప్ నెట్వర్క్లో మాత్రం ఇన్వాయిస్ ప్రాసెసింగ్పై ఎలాంటి ప్రభావం పడలేదని అన్నారు.
లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా గడచిన మే నెలలో దేశంలోని తమ ఉత్పత్తి కేంద్రాల్లో వాహనాల తయారీని పునఃప్రారంభించింది. ఇందులో భాగంగానే, కంటైన్మెంట్ జోన్లు మినహా దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని డీలర్షిప్ కేంద్రాలను కూడా హోండా రీఓపెన్ చేసింది. దీంతో దేశంలో తిరిగి హోండా బ్రాండ్ సేల్స్ మరియు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
MOST READ: బిఎస్-6 హోండా CD 110 డ్రీమ్బైక్ : ధర & ఇతర వివరాలు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోండా బ్రాండ్ తమ ప్రొడక్షన్ యూనిట్లలో మరియు డీలర్షిప్ కేంద్రాలలో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలను పూర్తిస్థాయిలో పాటిస్తోంది. మే 2020లో హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా 54,000 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఇది 88 శాతం క్షీణతను నమోదు చేసింది. మే 2019లో హోండా 4.82 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.
హోండా సైబర్ అటాక్పై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
కరోనా కట్టడి కోసం కేంద్రం ప్రకటించిన లాక్డౌన్లో కేంద్రం గత మే నెలలో సడలింపులు ప్రకటించిన నేపథ్యంలో హోండా బ్రాండ్ దేశంలో తమ కార్లు, మోటార్సైకిళ్ల వ్యాపారాన్ని దశల వారీగా తిరిగి ప్రారంభిస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ సైబర్ దాడికి గురవటం కాస్తంత విచారకరమే అయినప్పటికీ, భారత్లోని కంపెనీ ప్లాంట్లపై మాత్రం దాని ప్రభావం పెద్దగా లేకపోవటం అనేది మంచి విషయం. కోవిడ్-19 తర్వాత హోండా అమ్మకాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.