మహీంద్రా లాంచ్ చేసిన 210 అనివెర్సరీ స్పెషల్ ఎడిషన్ : ప్యూజో 125 స్కూటర్
మహీంద్రా యాజమాన్యంలోని ప్యూజో మోటార్ సైకిల్స్ జంగో 125 స్కూటర్ యొక్క 210 ఆనివర్సిరీ ఎడిషన్ను విడుదల చేసింది. ప్యూజో యొక్క మోటారుసైకిల్ విభాగం జ్ఞాపకార్థం ఈ కొత్త స్కూటర్ విదుదల చేసింది. ఈ కొత్త స్కూటర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా ప్యూజో ఫ్యామిలీ 1810 లో ఫ్రాన్స్లో కాఫీ మిల్లు మరియు సైకిల్ తయారీదారుగా ప్రారంభమైంది. ప్యూజో కంపెనీని 1896 లో అర్మాండ్ ప్యూజో స్థాపించారు. 2015 లో మహీంద్రా & మహీంద్రా ప్యూజోలో 51% వాటాను కొనుగోలు చేసింది.

2019 లో ప్యూజో మోటార్ సైకిల్స్ మహీంద్రా కంపెనీకి పూర్తిగా యాజమాన్యంలోని సంస్థగా మారింది. ప్రస్తుత ఫ్రెంచ్ బైక్ తయారీదారు తన చరిత్ర మరియు వారసత్వాన్ని కొత్త లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్తో జరుపుకోవాలని నిర్ణయించారు.

210 ఆనివర్సిరీ ఎడిషన్ స్కూటర్లో 21 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేయబడతాయి. ఫ్రెంచ్ జాతీయ జెండా యొక్క రంగు లాగ ఈ స్కూటర్ బ్లూ, బ్లాంక్ మరియు రూజ్ (నీలం, తెలుపు మరియు ఎరుపు) యొక్క మూడురంగుల కలయికతో ఉంటుంది.

స్కూటర్ ముందు భాగంలో తెలుపు బాడీ ప్యానెల్లు ఉండగా, రెడ్ మరియు బ్లూ చారలు నిలువుగా ఉంటాయి. ఈ స్కూటర్ యొక్క సైడ్ ప్రొఫైల్ బ్లూ మరియు పైభాగంలో క్రోమ్ స్ట్రిప్ ఉంటుంది.

స్కూటర్ పైభాగం తెల్లగా ఉంటుంది. ఈ స్కూటర్ రెడ్ కలర్ లో వైట్ స్టిచ్చింగ్ తో చాలా ఆకర్షణీయమైన క్విల్టెడ్ లెదర్ స్ప్లిట్ సీట్లు ఇవ్వబడ్డాయి. స్కూటర్లో 210 స్టిక్కర్లు అమర్చారు. మొత్తంమీద ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

స్కూటర్లో 125 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 9.99 బిహెచ్పి శక్తి మరియు 8.9 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్కూటర్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.

స్కూటర్లో 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు మరియు ఎబిఎస్ ఉన్నాయి. జంగో 210 ఆనివర్సిరీ ఎడిషన్ స్కూటర్ ధర రూ. 437,800 JPY. ఇది భారత కరెన్సీ ప్రకారం రూ. 3.1 లక్షలు.

ఈ చిన్న స్కూటర్కు అధిక ధర ఖర్చవుతుంది. రెండు శతాబ్దాల నాటి కుటుంబ వ్యాపారాన్ని జరుపుకోవడానికి ఈ స్కూటర్ ఉత్పత్తి కేవలం 21 యూనిట్లకు పరిమితం చేయబడింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








