Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
394 మంది పోలీసులకు గాయాలు.. కొందరు ఐసీయూలో.. 19 మంది అరెస్ట్: ఢిల్లీ సీపీ
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రేకింగ్ ; 2021 డాకర్ ర్యాలీ నాల్గవ స్టేజ్లో కుప్పకూలిన సిఎస్ సంతోష్
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన డాకర్ ర్యాలీ గురించి దాదాపు తెలియనివారు ఉండరు. ఇప్పుడు ఈ 2021 డాకర్ ర్యాలీ సౌదీ అరేబియాలో జరుగుతోంది. ప్రస్తుతం ఒకటి, రెండు, మూడు మరియు నాల్గవ దశలు పూర్తయ్యాయి. ఇందులో ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది రైడర్లు పాల్గొన్నారు. ఇందులో భారతదేశం తరపున పాల్గొన్న వారిలో చెప్పుకోదగ్గ వ్యక్తి మరియు గర్వించదగ్గ వ్యక్తి సిఎస్ సంతోష్.

ఇతడు ఈ ర్యాలీలో మొదటి నుంచి చాలా చురుకుగా పాల్గొని అద్భుతమైన ప్రతిభను చూపుడు. కానీ దురదృష్టకరం ఏమిటంటే సంతోష్ డాకర్ ర్యాలీ నాలుగో దశలో గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. 2021 డాకర్ ర్యాలీ నాల్గవ దశలో వే పాయింట్ 4 ను దాటిన తర్వాత ఇండియన్ రైడర్ హీరో మోటార్స్పోర్ట్ యొక్క సిఎస్ సంతోష్ కుప్పకూలడంతో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది.

సిఎస్ సంతోష్ను రియాద్ ఆసుపత్రికి తరలించారు. సిఎస్ సంతోష్ గాయం నుంచి కోలుకుంటున్నట్లు హీరో మోటోస్పోర్ట్ తెలిపింది. కానీ ఈ రోజు సంతోష్ కోమాలోకి వెళ్లినట్లు తెలిపింది. ఇది నిజంగా విషాదకరమైన వార్త. డాకర్ ర్యాలీలో పాల్గొని ఎంతో కీర్తి ప్రతిష్టలు తెస్తున్న సంతోష్ కోమాలోకి వెళ్లడం జీర్ణించుకోలేని విషయం.
MOST READ:ఒక్క నెలలో 2 వేలు కోట్లకు పైగా ఫాస్ట్ట్యాగ్ వసూల్.. చూసారా !

సిఎస్ సంతోష్ డాకర్ ర్యాలీలో ఏడవసారి భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రపంచంలోనే కష్టతరమైన మరియు అత్యంత ప్రమాదకరమైన డాకర్ ర్యాలీలో పాల్గొన్న మొదటి భారతీయుడు సిఎస్ సంతోష్. ఇండియన్ ఏస్ ర్యాలీ వంటి పలు ప్రతిష్టాత్మక ర్యాలీ రేసుల్లో పాల్గొన్నాడు.

సిఎస్ సంతోష్ స్టార్టింగ్ ప్రోలాగ్ దశలో 35 వ స్థానంలో నిలిచి 2021 డాకర్ ర్యాలీని ప్రారంభించారు. ఈ ఏడాది డాకర్ ర్యాలీ నాలుగో దశను 43 వ స్థానంలో ముగించాడు. డాకర్ ర్యాలీ మూడో దశలో 36 వ స్థానంలో నిలిచాడు. మూడవ దశలో హీరో మోటోస్పోర్ట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎస్ సంతోష్ 36 వ స్థానంలో నిలిచారు.
MOST READ:ఇదొక 'చెత్త' లంబోర్ఘిని కార్.. అవును మీరు చదివింది కరెక్టే..

ముగ్గురు రైడర్లతో కూడిన హీరో మోటోస్పోర్ట్ టీమ్ లో సిఎస్ సంతోష్ చేరారు. ఇందులో జోక్విమ్ రోడ్రిగెజ్ మరియు సెబాస్టియన్ బుహ్లెర్ ఉన్నారు. సిఎస్ సంతోష్ మరియు జోక్విమ్ రోడ్రిగెజ్ ఐదవసారి డాకర్ ర్యాలీలో కనిపిస్తున్నారు. 2021 డాకర్ ర్యాలీలో హీరో మోటోస్పోర్ట్ టీమ్ 3 స్టేజ్ తర్వాత జనరల్ రైకింగ్లో ఇద్దరు రైడర్స్ టాప్ 25 లో ఉన్నారు.

జోకిమ్ రోడ్రిగెజ్ 19 వ స్థానంలో, సెబాస్టియన్ బుహ్లెర్ 24 వ స్థానంలో నిలిచారు. సి.ఎస్ సంతోష్ 34 వ స్థానంలో ఉన్నాడు. మూడవ స్టేజ్ పోతయినా తర్వాత, సిఎస్ సంతోష్ మాట్లాడుతూ, ఈ స్టేజ్ మరొక సుదీర్ఘమైన మరియు వేగవంతమైన దశ. ఇది చాలావరకు కష్టతరంగా ఉన్నప్పటికీ ఒక సవాలుగా ఉందన్నారు. ఎట్టకేలకు మూడవ స్టేజ్ పూర్తయ్యి నాల్గవ స్టేజ్ కి వెళ్లడం నిజంగా ఆనందంగా ఉందన్నారు.
MOST READ:మైలేజ్ తగ్గుతోందా? బహుశా ఇవే కారణాలు కావచ్చు!

యావత్ భారతదేశం గర్వించదగ్గ సంతోష్ ఈ విధంగా ప్రమాదానికి గురవ్వడం చాలా బాధాకరం. సీఎస్ సంతోష్ త్వరగా కోలుకోవాలని, తిరిగి ఇలాంటి మరిన్ని ర్యాలీల్లో పాల్గొనాలని మేము ఆశిస్తున్నాము.