Just In
- 14 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తనకు కేటాయించిన బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ స్థానంలోకి రేంజ్ రోవర్ తెచ్చుకున్న మోడీ ఎందుకో తెలుసా ?
ఆగష్టు 15 న జరిగిన 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసిన నరేంద్ర మోడీ తనకు కేటాయించిన బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ కారులో రావాల్సి ఉండగా, రేంజ్ రోవర్లో ఎర్రకోటను చేరుకుని ఆశ్చర్యపరిచాడు.
భారత ప్రధాన మంత్రి ఇది వరకు వినియోగించే సెడాన్ రకపు లగ్జరీ కారు స్థానంలోకి ఎస్యూవీ వాహనం వచ్చి చేరింది. ఆగష్టు 15 న జరిగిన 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విచ్చేసిన నరేంద్ర మోడీ తనకు కేటాయించిన బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ కారులో రావాల్సి ఉండగా, రేంజ్ రోవర్లో ఎర్రకోటను చేరుకుని ఆశ్చర్యపరిచాడు.
భారత ప్రధాన మంత్రిగా మే 2014 లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అన్ని విధాలా సురక్షితమైన మరియు భద్రత పరంగా మోడిఫికేషన్స్ నిర్వహించిన బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ కారును కేటాయించడం జరిగింది.
Recommended Video
భారత 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట వద్ద ప్రసంగించడానికి బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్లో రావాల్సిన మోడీ రేంజ్ రోవర్ ఎస్యూవీలో వచ్చి మీడియా మరియు భారత ప్రభుత్వాధికారులను సైతం ఆశ్చర్యపరిచారు.
ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా ప్రత్యేక భద్రతా బృందం ఆగష్టు 13 వ తేదీన బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ మరియు ఇతర ప్రధాన కాన్వాయ్ ద్వారా రిహార్సల్స్ చేయించడం జరిగింది. అదే రోజున ఎర్ర కోట వరకు వచ్చిపోయేందుకు ముందస్తు మార్గాన్ని కూడా నిర్ణయించింది.
ఓ ప్రభుత్వ అధికారి నుండి సమాచారం మేరకు, బహుశా ప్రధాన మంత్రి గారి భద్రత దృష్ట్యా కాన్వాయ్లోని బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ స్థానంలో రేంజ్ రోవర్ ఎస్యూవీని కేటాయించి ఉండవచ్చని తెలిపాడు.
మరికొందరి కథనం మేరకు, రేంజ్ రోవర్ ప్రస్తుతం జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆధీనంలో ఉంది. టాటా మోటార్స్ ఈ జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను కొనుగోలు చేసింది. కాబట్టి ఇండియన్ సంస్థ, ఇండియాలో తయారు చేసిన కారును వినియోగించాడని తెలుస్తోంది.
గతంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు కూడా నరేంద్ర మోడీ బిఎమ్డబ్ల్యూ 7-సిరీస్ అధికారిక కాన్వాయ్లో వచ్చారు.
పంద్రాగష్టు వేడుకల్లో ప్రసంగం అనంతరం మోడీ రేంజ్ రోవర్ ఎస్యూవీ ముందు సీటులో కూర్చుని కొంత దూరం ప్రయాణించాక, శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారుల దక్కరికివెళ్లి పలుకరించారు.
ప్రస్తుతం ప్రధాన మంత్రి ప్రత్యేక భద్రతా బృందం ఆయన కోసం విభిన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కాన్వాయ్లో సిద్దంగా ఉంచింది. అత్యవసర మరియు ప్రతికూల పరిస్థితులలో కేవలం ఒక్క వాహనం మీదే ఆధారపడకుండా ముందు జాగ్రత్తగా కొన్ని వాహనాలను ఏర్పాటు చేసుకుంది.