Just In
- 5 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 11 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 14 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2021 మే 24 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్న హీరో మోటోకార్ప్; పూర్తి వివరాలు
భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ అధికంగా వ్యాపించి ఎంతో మంది మరణానికి కారణమైంది. ఈ మహమ్మారి నివారణ కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటూ కరోనా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు దేశంలోని అన్ని ఆటో మొబైల్ పరిశ్రమలు మూసివేయబడ్డాయి.
అయితే ఇటీవల దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరుపొందిన హీరో మోటోకార్ప్ తన ప్లాంట్లలను ఇప్పుడు దశల వారీగా ప్రారంభించనున్నట్లు తెలిపింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం 2021 మే 24 నుండి హీరో మోటోకార్ప్ కంపెనీ తన అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.
కంపెనీ తన ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించిన సమయంలో సరైన భద్రతా ప్రమాణాలకు అనుకూలంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కరోనా సంక్రమణను తగ్గించడానికి హీరో మోటోకార్ప్ ఈ నెల ప్రారంభం నుండి తన ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసింది.
MOST READ:త్వరపడండి.. ఇప్పుడు వెస్పా & ఎప్రిలియా స్కూటర్లపై భారీ డిస్కౌంట్స్
అయితే ఇప్పుడు దేశంలో కరోనా కేసులు తగ్గిన చోట, ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి పూర్తి భద్రతతో ప్లాంట్లను ప్రారంభించనున్నారు. మే 17 నుండి సంస్థ తన మూడు ప్లాంట్లైన గురుగ్రామ్, డెహ్రాడూన్ మరియు హరిద్వార్ లో సింగిల్ షిఫ్ట్ లో ఉత్పత్తిని ప్రారంభించింది.
అయితే కంపెనీ ఇతర ప్లాంట్లు, నీమ్రానా, రాజస్థాన్, హలోల్, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మే 24 సోమవారం నుండి సింగిల్ షిఫ్ట్ లో ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి. దీనితో పాటు నీమ్రానా లోని గ్లోవల్ పార్ట్స్ సెంటర్ కూడా ప్రారంభమవుతుంది.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని
భారతదేశంలో కంపెనీ దేశీయ మార్కెట్ కోసం ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా, ప్రపంచ స్థాయిలో ఉత్పత్తిని మెరుగుపర్చడానికి కంపెనీ కృషి చేస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని క్రమంగా సెకండ్ షిఫ్ట్ ఉత్పత్తి కూడా ప్రారంభించనుంది.
హీరో మోటోకార్ప్ 18 నుంచి 45 సంవత్సరాల వయసున్న ఉద్యోగులకు టీకాలు వేయడానికి వీలైనంత త్వరగా చొరవ ప్రారంభించింది. ఇందులో కూడా 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు దాదాపు 90 శాతం మందికి టీకాలు వేశారు. ఈ సమయంలో అన్ని భద్రత మరియు పరిశుభ్రత ప్రోటోకాల్లను జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందని కంపెనీ తెలిపింది.
హీరో మోటోకార్ప్ కంపెనీతో పాటు దేశంలో ఉన్న చాలా ద్విచక్ర వాహన సంస్థలు మే నెలలో తమ ఉత్పత్తి ప్లాంట్లను మూసివేసాయి. అయితే ఇప్పుడు హీరో మోటోకార్ప్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్న మొదటి కంపెనీ అవుతుంది. ఇతర కంపెనీలు కూడా రాబోయే రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది.