భారతీయ విపణిలోకి దేశీయ మెర్సిడెస్ బెంజ్..!!

ఇ-250, ఇ-250 సీడీఐబీఈ పేర్లతో విడుదలయిన ఈ మోడళ్లను మెర్సిడెస్ భారతీయ విభాగానికి సీఎండీ విల్ ఫ్రెండ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం దేశీయ వాణిజ్య నగరం ముంబై లో ఘనంగా జరిగింది. ఈ ఇ-250, ఇ-250 సీడీఐబీఈ కార్ల ఎక్స్ షో-రూం ధరలు ముంబైలో వరుసగా 41.13 లక్షలు, 39.87 లక్షలుగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్లు తప్పక జనాధరణనను పొందుతాయనే ఆశాభావాన్ని వ్యాక్తం చేసారు. ఈ ఏడాది భారతీయ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








