ఏప్రిల్ నుండి 20% పెరగనున్న మోటార్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం

"మార్చి 31, 2012 నుండి ప్రస్తుతం అమలులో ఉన్న ఇండియన్ మోటార్ థర్డ్ పార్టీ పూల్ సిస్టమ్ను రద్దు చేయాలని నిర్ణయించడమైనద"ని ఐఆర్డీఏ ఓ ఆర్డర్ను జారీ చేసింది. ఐఆర్డీఏ తీసుకున్న ఈ నిర్ణయం వలన వాహన బీమా ప్రీమియం రేట్లు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పూల్ వల్ల ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకే ప్రయోజనం కలుగుతోందని, తమకు మాత్రం నష్టాలు మిగులుతున్నాయని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనరల్ ఇన్సూరెన్స్ పరిశ్రమకు రూ.3,500 కోట్ల మేర నష్టాలు రావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








