టాటా నానో ప్లాంటుకు సమీపంలో ఫోర్డ్ రెండో ప్లాంటు

అహ్మదాబాద్ సమీపంలోని సనంద్ తాలూకాలో 400 ఎకరాల స్థలాన్ని ఫోర్డ్ ఇండియా గుర్తించింది. ఈ ప్లాంటు ఏర్పాటు కోసం ఫోర్డ్ కంపెనీ సుమారు రూ.5,000 కోట్లను వెచ్చించనున్నట్లు సమాచారం. స్థలం మరియు ప్లాంటు ఏర్పాటు విషయమై ఫోర్డ్ ఇండియా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా తమిళనాడులోని చెన్నైలో ఓ ప్లాంటు ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులను దేశీయ మార్కెట్కు పరిచయం చేసేందుకు అనువుగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే అంశంపై కంపెనీ దృష్టి పెట్టింది.


Click it and Unblock the Notifications








