ఐదువేలకు పైగా ఎక్స్యూవీ500 ఎస్యూవీల బుకింగ్స్

మహీంద్రా ఎక్స్యూవీ500 ఎస్యూవీకు సంబంధించిన హైలైట్స్ ఇలా ఉన్నాయి.
* విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే 5000 యూనిట్లకు పైగా బుకింగ్స్.
* 35,000 లకు పైగా టెస్ట్ డ్రైవ్ అభ్యర్థనలు.
* కేవలం రెండు వారాల్లోనే ఎక్స్యూవీ500 వెబ్సైట్ను సందర్శించిన 8.5 లక్షల విజిటర్లు.
* 'గెస్ ది ప్రైస్ కాంటెస్ట్'కు 1.15 లక్షల ఎంట్రీలు.
ఎక్స్యూవీ500 ఎస్యూవీకు స్పందన పట్ల ఎమ్ అండ్ ఎమ్ ఆటోమోటివ్ డివిజన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ జెజురికర్ మాట్లాడుతబూ.. "ఎక్స్యూవీ500 విడుదలైన ఆరు రోజుల్లేనే కేవలం ఐదు నగరాల నుంచే 5000 యూనిట్లకు పైగా బుకింగ్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్స్యూవీ500 ఎస్యూవీ పట్ల వినియోగదారులు చూపిస్తున్న అశేష ఆదరణకు, విశ్వాసానికి గానూ వారికి మేము ధన్యవాదములు తెలియజేకుంటున్నామ"ని అన్నారు.
కాగా.. ఇదిలా ఉండగా, మహీంద్రా ఎక్స్యూవీ500 విడుదలకు మహీంద్రా అండ్ మహీంద్రా నిర్వహించిన 'గెస్ ది ప్రైస్ కాంటెస్ట్'లో 20 ఎఫ్1 రేస్ షో టికెట్లను గెలుచుకున్న విజేతల వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. ఈ కాంటెస్ట్లో ఎక్స్యూవీ500 ఎస్యూవీను కొల్హాపూర్కు చెందిన అమిత్ మేట్ సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications








